సాక్ష్యం – రిలీజ్ డేట్

నటీనటులు : సాయి శ్రీనివాస్, పూజా హెగ్దే తదితరులు
కళ: ఏ.ఎస్.ప్రకాష్
కూర్పు: కోటగిరి వెంకటేశ్వర్రావు
సినిమాటోగ్రఫీ: ఆర్ధర్ ఎ.విల్సన్
మాటలు: సాయిమాధవ్ బుర్రా
యాక్షన్: పీటర్ హైన్స్
సంగీతం: హర్షవర్ధన్
నిర్మాణం: అభిషేక్ పిక్చర్స్
నిర్మాత: అభిషేక్ నామా
రచన-దర్శకత్వం: శ్రీవాస్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ – పూజా హెగ్డే జంటగా తెరకెక్కిన ‘సాక్ష్యం’ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా విడుదల హక్కులను ప్రఖ్యాత నిర్మాణ సంస్థ ‘ఎరోస్’ సొంతం చేసుకొంది. బాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థగానే కాక పలు ప్రతిష్టాత్మక తెలుగు చిత్రాలను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసిన ఎరోస్ సంస్థ ఇప్పుడు ‘సాక్ష్యం’ హక్కులను సొంతం చేసుకోవడం విశేషం.

సాక్ష్యం మూవీ రిలీజ్ విషయంలో మీడియా లో వస్తున్న రూమర్స్ కి చెక్ పెట్టేస్తూ సినిమా నిర్మాతలు రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా జూలై 27 న సినిమాని రిలీజ్ చేస్తున్నట్లు అఫీషియల్‌గా ప్రకటించారు. గతం కొద్ది రోజులుగా సాక్ష్యం సినిమా రిలీజ్‌ వాయిదా పడే అవకాశముందన్న ప్రచారం జరుగుతోంది. సినిమాలో కొన్ని సన్నివేశాల్లో జంతువులు, పక్షులను వినియోగించినందున సెన్సార్ సర్టిఫికేట్‌ ఇచ్చేందుకు నిరాకరించినట్టుగా వార్తలు వినిపించాయి. వాటికి బ్రేక్ వేస్తూ ఈ నెల 27 రిలీజ్ కి సిద్దమయింది.