నరసింహానాయుడును ఇప్పుడెవరు చూస్తారు బాబు

Sequel to Balakrishna's Narasimha Naidu

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

నందమూరి బాలకృష్ణ కెరీర్‌లో సూపర్‌ హిట్‌ చిత్రాల్లో ఒక్కటిగా నిలిచిన చిత్రం ‘నరసింహా నాయుడు’. బి గోపాల్‌ దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమాతో బాలయ్యకు తిరుగులేని మాస్‌ ఇమేజ్‌ దక్కింది. చిరంజీవి, వెంకటేష్‌లతో పోటీ పడ్డ ఆ చిత్రం విజయం సాధించి సత్తా చాటింది. బాలయ్యకు ఎన్ని సూపర్‌ హిట్‌ చిత్రాలు వచ్చినా కూడా ఆ సినిమా ప్రత్యేకం అంటూ చెబుతూ వస్తుంటాడు. తాజాగా ఆ సినిమాకు సీక్వెల్‌ను చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. బాలకృష్ణ చాలా బోలా మనిషి. ఆ బోలా తనంను ఆసరాగా చేసుకుని పలువురు రచయితలు మరియు దర్శకులు ఆయనతో చెత్త సినిమాలు చేశారు. ఇప్పుడు చిన్నికృష్ణ అదే పని చేయబోతున్నాడు.

Sequel to Balakrishna's Narasimha Naidu

బాలకృష్ణకు ఇటీవలే ‘నరసింహానాయుడు’ చిత్రానికి సీక్వెల్‌ కథను చెప్పడం జరిగిందట. ఆ కథ బాలయ్యకు తెగ నచ్చేసింది. నరసింహానాయుడు అనగానే బాలయ్యకు నచ్చి ఉంటుంది. కథ వినకముందే సీక్వెల్‌ చేయాలని బాలయ్య భావించి ఉంటాడు. కథ కూడా కాస్త బాలయ్యను ఆకట్టుకోవడంతో వెంటనే చేసేయాలని పట్టుదలతో ఉన్నాడు. ప్రస్తుతం నరసింహానాయుడు సినిమాకు సీక్వెల్‌ కథను సిద్దం చేస్తున్నట్లుగా రచయిత చిన్ని కృష్ణ చెప్పడంతో ఇప్పుడు అంతా కూడా ఈ చిత్రం గురించి చర్చించుకుంటున్నారు.

balakrishna

ఇంతకు ఈ సీక్వెల్‌కు ఎవరు దర్శకత్వం వహిస్తారు. గోపాల్‌ దర్శకత్వంలో నరసింహానాయుడు సినిమా సీక్వెల్‌ అయితే ప్రేక్షకులు తీసి పక్కన పెట్టడం ఖాయం. ఈతరం దర్శకుడు ఆ సినిమా ఛాయలు కనిపించకుండా కొత్త కథతో దానికి సీక్వెల్‌గా తీస్తే పర్వాలేదు, అప్పటిలా సినిమాను ఉన్నది ఉన్నట్లుగా కొనసాగిస్తే మాత్రం సినిమా ఎవరు చూడరు అంటూ విశ్లేషకులు అప్పుడే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు ఈ సినిమాపై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుంది అనేది తెలియాల్సి ఉంది.