జాతీయ స్థాయిలో ద.మ.రైల్వేకు ఏడు అవార్డులు

Seven awards for DM Railway at national level
Seven awards for DM Railway at national level

జాతీయ స్థాయిలో ద.మ.రైల్వేకు ఏడు అవార్డులు లభించాయి. ‘అతి విశిష్ట రైల్ సేవా పురస్కార్-2023’ పేరుతో ఇచ్చే అవార్డులను ఈ నెల 15న దిల్లీలో జరిగే కార్యక్రమంలో రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రధానం చేస్తారు. ఈ మేరకు ద.మ.రైల్వే వివరాల్ని బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. అవార్డులు
అందుకోనున్న ఉద్యోగులు..

1. డీఎస్ రామారావు (డిప్యూటీ చీఫ్ ఇంజినీర్, కన్స్ట్రక్షన్స్, కాజీపేట)
2. సీహెచ్ దినేశ్రెడ్డి (సీనియర్ డివిజనల్ ఎలక్ట్రికల్ ఇంజినీర్, ఎలక్ట్రిక్ లోకోషెడ్, విజయవాడ)
3. మల్లెల శ్రీకాంత్ (డివిజనల్ ఆపరేషన్స్ మేనేజర్, ప్రస్తుతం రైల్వే బోర్డులో డిప్యూటీ డైరెక్టర్)
4. సి.శివకుమార్ కశ్యప్ (డివిజనల్ సిగ్నల్ టెలికమ్యూనికేషన్ ఇంజినీర్, సికింద్రాబాద్)
5. టి.ప్రత్యూష (మహిళా సబ్ ఇన్స్పె క్టర్, నిజామాబాద్)
6. టి.నటరాజన్ (చీఫ్ టికెట్ ఇన్స్పె క్టర్, సికింద్రాబాద్)
7. వీవీ రంగయ్య (ట్రాక్ మెయింటెయినర్, బీదర్)