ఏపీలో వైసీపీకి షాక్.. ఇండియా టుడే సర్వే సంచలనం

Shock for YCP in AP.. India Today survey sensational
Shock for YCP in AP.. India Today survey sensational

ఏపీలో వైసీపీకి బిగ్ షాక్ తగలనుందా? సీఎం జగన్ గ్రాఫ్ గణనీయంగా తగ్గుముఖం పడుతోందా? వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీకి ప్రమాద ఘంటికలు తప్పవా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇటీవల ఐప్యాక్ సర్వే లీక్ అయ్యిందంటూ కొన్ని వార్తలు వచ్చాయి. ఆ సర్వే సారాంశం ప్రకారం వైసిపి 30 నుంచి 40 స్థానాలకు పరిమితం అవుతుంది. అయితే ఇప్పుడు ఒకటి ఏపీలో ఆసక్తికర ఫలితాలను ఒక నేషనల్ మీడియా సంస్థ వెల్లడించింది. ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు జరిగితే పై చేయి టిడిపిదే అని స్పష్టం చేసింది. దీంతో అధికార పార్టీకి ఒక్కసారిగా షాక్ తగిలింది.

ఎన్నికలు సమీపిస్తున్న కొలదీ సర్వేలు, ఒపీనియన్ పోల్స్ సర్వసాధారణం. గత కొద్ది నెలలుగా వైసీపీకి ఏకపక్ష విజయాలను వెలువడుతున్న సర్వేలన్నీ కట్టబెట్టాయి. ఇటీవల టైమ్స్ నౌ ఛానల్ ప్రతి రెండు నెలలకు ఒకసారి సర్వేలను బయటపెడుతోంది. వైసీపీకి 25కి 25 స్థానాలను కట్టబెట్టేస్తోంది. చివరకు వైసీపీ శ్రేణులకు సైతం ఈ సర్వే ఫలితాలు మింగుడు పడడం లేదు. క్షేత్రస్థాయిలో చూస్తే ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. ఏకపక్ష విజయాలు సాధ్యమా? ఎంతలా సంక్షేమ పథకాలు అందించినా. అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ప్రశాంత్ కిషోర్ ఐప్యాక్ సర్వే లీక్ అయినట్లు సరిగ్గా ఇటువంటి సమయంలోనే ప్రచారం జరుగుతోంది. అందులో వైసిపి ఓటమి చవిచూస్తుందని స్పష్టమైంది. అయితే ఇండియా టుడే టీవీ ఛానల్ ఒక సర్వేను దానిని నిజం చేస్తూ తాజాగా ప్రకటించింది.

ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రాజ్దీప్ సర్దేశాయ్ ప్రకటించిన తాజా సర్వే ప్రకారం టిడిపికి 15 లోక్ సభ స్థానాలు లభిస్తాయని తేలింది. ఇండియా టుడే సంస్థ దేశవ్యాప్తంగా లోక్ సభ స్థానాల ప్రాతిపదికన సర్వే చేపట్టింది. మూడ్ ఆఫ్ ద నేషన్ ప్రోగ్రాం లో ప్రజల మూడ్ ను తెలుసుకొని సెఫాలజిస్టులు ఒక అంచనా వేశారు. ఇదే సర్వేలో టిడిపికి ఏడాది కిందట ఏడు లోక్సభ సీట్లు లభించాయి. మధ్యలో ఆ సంఖ్య పదికి చేరింది. ఇప్పుడు ఏకంగా 15కు ఎగబాకింది.టిడిపికి పొత్తులు లేకుండానే ఈ స్థానాన్ని లభిస్తాయని ఇండియా టుడే స్పష్టం చేసింది.

గత ఎన్నికల్లో అధికార వైసిపికి 23 పార్లమెంట్ స్థానాలు లభించాయి. అసెంబ్లీ స్థానాలకు సంబంధించి 151 సీట్లను ఆ పార్టీ దక్కించుకుంది. వైసీపీ నాయకత్వం మరోసారి తామే అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది. అందుకు తగ్గట్టుగానే ఇటీవల వెల్లడైన సర్వేలన్నీ వైసీపీకి అనుకూలంగా వచ్చాయి. ఇప్పుడు 15 లోక్ సభ స్థానాలు టిడిపికి వస్తాయని అంచనా వేయడం వైసిపి జీర్ణించుకోలేకపోతోంది.ప్రతి లోక్సభ స్థానం పరిధిలో ఏడు అసెంబ్లీ సీట్లు ఉంటాయి. ఈ లెక్కన 105 అసెంబ్లీ సీట్లు తెలుగుదేశం పార్టీకి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.