తెలుగు మరియు తమిళ చిత్రాల్లో ఒకప్పుడు వ్యాంప్ పాత్ర అనగానే ఎక్కువ శాతం మందికి సిల్క్ స్మితను గుర్తుకు చేసుకునేవారు. సిల్మ్స్మిత స్టార్ హీరోయిన్స్ రేంజ్లో పారితోషికం తీసుకునేది. సినిమాలో కొద్ది సమయం ఈమె కనిపిస్తే చాు అని నిర్మాతలు అప్పట్లో అనుకునేవారు. అందుకే ఈమెకు భారీ పారితోషికాలు ఇచ్చి మరీ తమ సినిమాల్లో నటింపజేసుకునే వారు. ఈమె జీవితం అంతా కూడా సినిమాటిక్గా సాగింది. ఆమె మరణం కూడా చాలా బాధకరంగా జరిగింది. సిల్క్స్మిత జీవితం గురించి ఎక్కువ శాతం జనాలకు తెలియదు. ఆమె జీవితాన్ని చూపించేందుకు బాలీవుడ్లో డర్టీ పిక్చర్ తెరకెక్కింది. ఇప్పుడు అదే సిల్క్స్మిత జీవితంతో ఒక వెబ్ సిరీస్ను తీసేందుకు రంజిత్ పా సిద్దం అవుతున్నాడు.
సూపర్ స్టార్ రజినీకాంత్తో ‘కబాలి’, ‘కాలా’ చిత్రాలను తెరకెక్కించిన రంజిత్ పా ప్రస్తుతం సిల్క్ స్మిత జీవితంకు సంబంధించన విశేషాలను సేకరించే పనిలో ఉన్నాడు. డర్టీ పిక్చర్లో సిల్క్కు సంబంధించిన విషయాలు కనీసం 10 శాతం కూడా చూపించలేదు అని, అందుకే తాను ఆమె జీవితాన్ని మొత్తం ఆవిష్కరించేందుకు వెబ్ సిరీస్ను ఎంపిక చేసుకున్నట్లుగా ఆయన చెబుతున్నాడు. ఈ వెబ్ సిరీస్కు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెళ్లడి చేస్తాను అంటూ ఆయన ప్రకటించాడు. సిల్క్ స్మిత గురించి మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని ప్రయత్నిస్తున్న రంజిత్ పా ప్రయత్నాలు ఎంత మేరకు సక్సెస్ అవుతాయో చూడాలి.