Sports: ఆస్ట్రేలియా చిత్తు… సీరీస్ భారత్ కైవశం !

Sports: Australia lost... India won the series!
Sports: Australia lost... India won the series!

భారత్ మరియు ఆస్ట్రేలియాలు వరల్డ్ కప్ తర్వాత జరుగుతున్న మొదటి సిరీస్ ను గెలుచుకోవాలన్న తాపత్రయంలో ఉన్నాయి. ఇందులో భాగంగా 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ లో ఇప్పటికే ముగిసిన 3 మ్యాచ్ లలో ఇండియా 2 మరియు ఆస్ట్రేలియా ఒకటి గెలుచుకున్నాయి. నిన్న రాయ్ పూర్ లో జరిగిన మ్యాచ్ లోనూ చాలా ఉత్కంఠగా జరిగిన మ్యాచ్ లో భారత్ 20 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను మట్టి కరిపించి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సీరీస్ ను 3-1 తేడాతో కైవశం చేసుకుంది. అయితే మొదటి రెండు మ్యాచ్ లలో చాలా జోరుగా కనిపించిన భారత్ ఆ తర్వాత మ్యాచ్ లో పూర్తిగా తేలిపోయి ఓటమి పాలైంది.

ఇక నిన్న మ్యాచ్ లో జితేష్ శర్మ మరియు రింకు సింగ్ లు రాణించడంతో ఆ మాత్రం స్కోర్ చేయగలిగింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా ఛేదనలో నిర్ణీత ఓవర్ లలో 7 వికెట్లు కోల్పోయి 154 పరుగులకు పరిమితం అయ్యి 20 పరుగుల తేడాతో ఓటమి చెందింది. ఈ మ్యాచ్ లో అక్సర్ పటేల్ కీలక సమయంలో 3 వికెట్లు తీసి ఈ విజయంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా ఇతనికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా ఎంపికయ్యాడు.