భారత క్రికెటర్ మయాంక్ అగర్వాల్ హాస్పిటల్ లో చేరారు. తీవ్రమైన గొంతు, నోటి నొప్పి కారణంగా హుటాహుటిన ఆయనను అగర్తలాలోని ILS ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం అతనికి ప్రమాదం ఏమీ లేదని తెలుస్తోంది. దీంతో అతడు త్వరగా కోలుకోవాలని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం రంజీ ట్రోఫీలో భాగంగా అతడు అగర్తలా వెళ్లారు. కర్ణాటక జట్టుకు మయాంక్ కెప్టెన్ గా ఉన్నారు.
అయితే, అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరిన భారత క్రికెటర్ మయాంక్ అగర్వాల్ హెల్త్ అప్డేట్ ను వైద్యులు రిలీజ్ చేశారు. ఆయన గొంతు నొప్పితో ఇబ్బంది పడినట్లు తెలిపారు. వెంటనే ఆసుపత్రిలో చేరడంతో అవసరమైన వైద్యం అందించామని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని…. పర్యవేక్షణలో ఉంచామని వెల్లడించారు. ప్రస్తుతం మయాంక్ అగర్తలాలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.