Sports: IPL లో కోహ్లీ ఒంటరి పోరాటం.. పంజాబ్ పై RCB మొదటి విజయం

Sports: Kohli's lone fight in IPL.. RCB's first win over Punjab
Sports: Kohli's lone fight in IPL.. RCB's first win over Punjab

నిన్న ఐపీఎల్ 2024 టోర్నమెంటులో భాగంగా బెంగళూరు వర్సెస్ పంజాబ్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో RCB జట్టు ఘన విజయం సాధించింది. ఏకంగా 4 వికెట్ల తేడాతో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ ఆరు వికెట్లు నష్టపోయి 176 పరుగులు చేసింది.

శిఖర్ ధావన్ 45 పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన… RCB జట్టు మొదటి నుంచి అటాకింగ్ గా ఆడింది. ఇక ఈ నేపథ్యంలోనే 19.2 ఓవర్లలో బెంగళూరు ఆరు వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది. దీంతో ఈ టోర్నమెంట్ లో మొదటి విజయాన్ని నమోదు చేసుకుంది బెంగళూరు. ఇందులో విరాట్ కోహ్లీ 77 పరుగులు చేసి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. దీంతో విరాట్ కోహ్లీకి మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.