Sports: T-20 పోస్టర్ పైన రోహిత్… క్రికెట్ అభిమానుల డిమాండ్..

Sports: Rohit on T-20 poster...Cricket fans demand..
Sports: Rohit on T-20 poster...Cricket fans demand..

టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదలైంది. జూన్ 1 నుంచి ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. ఆ నెల 9న భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది. యూఎస్ఏ, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యమిచ్చే పొట్టి కప్లో టీమ్ఇండియా లీగ్ దశ మ్యాచ్లు అమెరికాలోనే జరుగుతాయి. తాజాగా ఈ మెగా టోర్నీ అధికారిక బ్రాడ్కాస్టర్ స్టార్స్పోర్ట్స్ తన సోషల్ మీడియాలో చేసిన పోస్టు ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. దాయాదుల పోరుకు సంబంధించి హార్దిక్ పాండ్య, షహీన్ ఫొటోలతో ఇమేజ్ను షేర్ చేసింది. దీంతో రోహిత్ శర్మ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్థాన్ జట్టు తమ టీ20 జట్టుకు కెప్టెన్గా షహీన్ను ప్రకటించింది. అయితే, టీమ్ఇండియా మాత్రం ఎవరి కెప్టెన్సీలో ఆడుతుందో ఇంకా తేలలేదు. అఫ్గాన్తో మూడు టీ20ల సిరీస్లో రోహిత్ ఆడతాడనే వార్తలు వస్తున్నాయి. అలాంటి సమయంలో హార్దిక్ పాండ్య ఫొటోను ఎలా వాడతారని కొందరు ఫ్యాన్స్ కామెంట్లు చేశారు. రోహిత్ శర్మనే వచ్చే టీ20 ప్రపంచకప్లో భారత్ను నడిపించాలని కోరారు.

కొందరు ఫ్యాన్స్ పెట్టిన కామెంట్లు..

* ‘‘హార్దిక్ పాండ్యకు బదులు రోహిత్ శర్మ ఫొటోను వాడాల్సిందే’’
* ‘ఆ పోస్టర్లో పాండ్య ఎందుకు? అతడినే కెప్టెన్గా చేస్తారని మీరెలా చెబుతారు?’’
* ‘‘అధికారికంగా రోహిత్ టీ20ల నుంచి వైదొలగలేదు. ఇప్పటికీ అతడే సారథి. అలాంటప్పుడు హార్దిక్ ఫొటోను కెప్టెన్ స్థానంలో ఏ విధంగా వాడతారు? ఇది సరైన నిర్ణయం కాదు’’
* ‘‘హార్దిక్ పాండ్య ప్రపంచ కప్ మొత్తానికి అందుబాటులో ఉంటాడని అనుకుంటున్నారా? ఐపీఎల్లోనూ కొన్ని మ్యాచ్లూ ఆడకపోవచ్చు ’’
* ‘‘మీ అభిప్రాయం ప్రకారం రోహిత్ శర్మ టీ20 ప్రపంచకప్లో ఆడటం లేదా?’’