Sports: టెస్టుల్లో మరో అరుదైన ఘనత సాధించిన రోహిత్ శర్మ

Sports: Rohit Sharma achieved another rare feat in Tests
Sports: Rohit Sharma achieved another rare feat in Tests

ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో భాగంగా భారత్, ఇంగ్లాండ్ మధ్య రాంచి వేదికగా జరుగుతున్న నాలుగోవ టెస్టులో భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టుల్లో మరో ఘనత సాధించారు. టెస్టుల్లో హిట్మ్యాన్ 4,000 పరుగుల మైలురాయిని అందుకున్నారు. మొత్తం 58 టెస్టుల్లో 4004 పరుగులు కంప్లీట్ చేసుకున్నారు. ఈ క్రమంలో టెస్టుల్లో 4 వేల పరుగులు పూర్తి చేసుకున్న 17వ భారత్ బ్యాటర్ ఆయన నిలిచారు.

ఇదిలా ఉంటే….192 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన భారత్ .. 3వ రోజు ఆట ముగిసే సమయానికి 40/0 రన్స్ చేసింది. ఈ మ్యాచ్లో భారత్ విజయం సాధించాలంటే ఇంకా 152 రన్స్ చేయాలి. ప్రస్తుతం క్రీజులో రోహిత్ శర్మ(24*), జైస్వాల్(16*) ఉన్నారు. ఇక మొదటి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ 353 రన్స్ చేయగా.. భారత్ 307 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.