Sports: కబడ్డీ సీజన్-10లో జైపుర్ -బెంగాల్ మధ్య పోరులో టై

Sports: Tie between Jaipur and Bengal in Kabaddi season-10
Sports: Tie between Jaipur and Bengal in Kabaddi season-10

అహ్మదాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ సీజన్-10లో తొలి టై. జైపుర్ పింక్ పాంథర్స్, బెంగాల్ వారియర్స్ మధ్య ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ చివరికి 28-28తో సమమైంది. ఈ మ్యాచ్ ఆరంభంలో డిఫెన్స్లో సత్తా చాటిన జైపుర్ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఎనిమిది ట్యాకిల్ పాయింట్లు సాధించి విరామ సమయానికి 13-9తో ముందంజలో నిలిచింది. కానీ బెంగాల్ పట్టు వదలకుండా పోరాడింది. ఒక్కో పాయింట్ కూడగడుతూ అంతరాన్ని తగ్గించింది. బెంగాల్ జట్టులో భవానీ రాజ్పుత్ (10) సూపర్ టెన్తో అదరగొట్టడంతో జైపుర్ను ఆలౌట్ చేసిన బెంగాల్ 16-13తో ఆధిక్యంలోకి వెళ్లింది. జైపుర్ తగ్గలేదు. శ్రీకాంత్ జాదవ్ (7) జోరుతో మళ్లీ గేమ్లోకి వచ్చింది. గేమ్ అటుఇటు మొగ్గుతూ.. చివరికి టైగా ముగిసింది. మరో హోరాహోరీ మ్యాచ్లో పట్నా పైరేట్స్ 33-30తో గుజరాత్ జెయింట్స్ ను ఓడించింది. సుధాకర్ (6), నీరజ్ కుమార్ (4), సచిన్ (4), సందీప్ కుమార్ (4) పట్నా విజయంలో కీలకపాత్ర పోషించారు. ఈ మ్యాచ్ ఆరంభంలో గుజరాత్ 3-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.

కానీ పట్నా పుంజుకుని స్కోరు సమం చేసింది. విరామ సమయానికి రెండు జట్లు 12-12తో సమానంగా నిలిచాయి. ఆ తర్వాత పట్నా దూకుడుగా ఆడింది. సచిన్ విజృంభించడంతో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఒక దశలో ఆ జట్టు 11 పాయింట్ల ఆధిక్యాన్ని సొంతం చేసుకుంది. కానీ రాకేశ్ (11) సూపర్-10 సాధించడంతో గుజరాత్ పుంజుకుని పాయింట్ల అంతరాన్ని తగ్గించింది. ఆఖర్లో మ్యాచ్ పై పట్నా పట్టు కొనసాగించడంతో గుజరాత్ ఓటమి తప్పలేదు.