శేఖర్‌ కమ్ములకు శ్రీరెడ్డి ప్రతి సవాల్‌

Sri Reddy again Controversy Comments On Sekhar Kammula

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
టాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు శేఖర్‌ కమ్ములపై హీరోయిన్‌ శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు, ఆరోపణలు ప్రస్తుతం టాలీవుడ్‌లో టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌ అయిన విషయం తెల్సిందే. ఇప్పటి వరకు క్లీన్‌ ఇమేజ్‌ ఉన్న శేఖర్‌ కమ్ముల గురించి ఆమె చేసిన ఆరోపణలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. తనపై ఆరోపణలు చేసిన శ్రీరెడ్డిని వదిలేది లేదు అంటూ శేఖర్‌ కమ్ముల తాజాగా ఒక ప్రకటనలో తెలియజేయడం జరిగింది. ఆమె వ్యాఖ్యల కారణంగా తాను, తన కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదనకు గురైనట్లుగా ఆయన చెప్పుకొచ్చాడు. ఆమె వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పకుంటే చట్టపరమైన చర్యలకు సిద్దం అవ్వాల్సి వస్తుందని శేఖర్‌ కమ్ముల పేర్కొన్న విషయం తెల్సిందే. శేఖర్‌ కమ్ముల బెదిరింపుకు తాజాగా శ్రీరెడ్డి స్పందించింది. 

శేఖర్‌ కమ్ములను మరోసారి టార్గెట్‌ చేసి శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసింది. తన సొంత అభిప్రాయాలను చెబుతుంటే కొందరు పిచ్చి పిచ్చి కామెంట్స్‌ చేస్తున్నారని, అలాంటి వారి తాట తీస్తానంటూ శ్రీరెడ్డి పేర్కొంది. తాను పలు సార్లు అన్యాయంకు గురయ్యాను అని, ఆ బాధతో తన అభిప్రాయాలు చెబుతున్నాను అంటోంది. తాను సోషల్‌ మీడియాలో ఏదైనా రాసుకుంటాను, అందులో నీ పేరు ఏమైనా రాశానా, నీ సినిమాల పేర్లు ఏమైనా మెన్షన్‌ చేశానా, జైల్లో నన్ను పెట్టించే అంతటి వాడివా అంటూ శేఖర్‌ కమ్ములకు ప్రతి సవాల్‌ విసిరింది. తన వద్ద డబ్బు లేక పోవచ్చు కాని, పోరాడేందుకు కావాల్సిన ధైర్యం ఉంది అంటూ చెప్పుకొచ్చింది. నేను తప్పు చేయలేదు కనుక ధైర్యంగా ఆయన ఏం చేసినా కూడా ఎదురు నిలుస్తాను అంటూ చెప్పుకొచ్చింది. తాను కొందరిపై లీగల్‌గా కూడా యాక్షన్‌ తీసుకోబోతున్నట్లుగా ఆమె పేర్కొంది. మొత్తానికి శ్రీరెడ్డి వ్యవహారం రోజు రోజుకు ముదిరి పాకన పడుతున్నట్లుగా ఉంది.