శ్రీరెడ్డి రెచ్చి పోతూనే ఉంది

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

శ్రీరెడ్డి సోషల్‌ మీడియాలో మళ్లీ రెచ్చి పోతుంది. గతంలో ఎలక్ట్రానిక్‌ మీడియాలో సంచలన వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఆస్థాయి వ్యాఖ్యలు చేస్తూ షాక్‌ ఇస్తుంది. ముఖ్యంగా నానిని ఉద్దేశించి ప్రతి రోజు ఏదో ఒక పోస్ట్‌ పెడుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. తాజాగా నీ కాపురంలో నిప్పులు పోస్తానురా నాని అంటూ హెచ్చరించింది. నానిపై ఈమెకు ఇంతగా ఎందుకు కక్ష అనే విషయం అర్థం అవ్వడం లేదు. ఈమెకు నానికి ఎక్కడ టచ్‌ అయ్యింది, ఇద్దరి మద్య గొడవకు కారణం ఏంటీ అనే విషయాన్ని తెలుసుకునేందుకు ఎక్కువ శాతం ఆసక్తి చూపుతున్నారు. సోషల్‌ మీడియాలో ఎంతో మంది కూడా ఇదే విషయాన్ని సోషల్‌ మీడియాలో ఆమెను ప్రశ్నిస్తున్నారు. కాని ఆమె పూర్తిగా క్లారిటీ ఇవ్వకుండా నానిగాడు అంటూ సంభోదిస్తూ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు అయితే చేస్తూ ఉంది. తాజాగా చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌ పై కూడా ఈమె విరుచుకు పడటం జరిగింది.

sri reddy once again comments on nani

గతంలో పవన్‌ కళ్యాణ్‌పై చేసిన వ్యాఖ్యలకు వందల సార్లు సారీ చెప్పిన ఈ అమ్మడు తాజాగా మరోసారి చిరంజీవి మరియు పవన్‌లపై తనదైన శైలిలో విమర్శలు చేసి షాక్‌ ఇచ్చింది. ప్రస్తుతం పవన్‌ ప్రజా యాత్రలో ఉన్న విషయం తెల్సిందే. దాని గురించి స్పందిస్తూ పవన్‌కు పలాసలో పులుసు కారిపోయింది అంటూ వ్యాఖ్యనించింది. పులస చేపలా ఎగిరి ఎగిరి పడుతున్నాడు. అన్యాయం, అక్రమంల గురించి మీరు మాట్లాడుతున్నారా అంటూ పవన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యనించింది. చిరంజీవిని ఉద్దేశించి ఎమ్మెల్యే సీట్లు కొనుగోలు చేసిన వారికి కుచ్చు టోపీ మరియు ఓట్లు వేసిన వారి నోట్ల మట్టి కొట్టారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. మొత్తానికి శ్రీరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో హీట్‌ పుట్టిస్తున్నాయి.

Sri Reddy about Pawan Kalyan