మళ్లీ ఆశలు రేపుతున్న రెడ్డిగారు

T Subbarami Reddy once again made a statement about the multi starrer film.
Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

కొన్ని నెలల క్రితం ఎంపీ టి సుబ్బిరామిరెడ్డి మాట్లాడుతూ తాను మెగా బ్రదర్స్‌ చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌లతో ఒక మల్టీస్టారర్‌ను నిర్మించబోతున్నట్లుగా ప్రకటించిన విషయం తెల్సిందే. అశ్వినీదత్‌ సహ నిర్మాతగా వ్యవహరించబోతున్న ఆ భారీ మల్టీస్టారర్‌ చిత్రంకు త్రివిక్రమ్‌ కథను సిద్దం చేస్తున్నట్లుగా ఆ మద్య రెడ్డిగారు చెప్పుకొచ్చారు. అయితే పవన్‌ మరియు చిరంజీవిలు ఆ మల్టీస్టారర్‌ చిత్రం గురించి ఇప్పటి వరకు నోరు ఎత్తలేదు. కనీసం త్రివిక్రమ్‌ కూడా తాను మల్టీస్టారర్‌ కోసం స్క్రిప్ట్‌ సిద్దం చేస్తున్నట్లుగా చెప్పింది లేదు. అంతా మర్చి పోతున్న సమయంలో మళ్లీ టి సుబ్బిరామరెడ్డి మరోసారి మల్టీస్టారర్‌ చిత్రం గురించిన ప్రకటన చేయడం జరిగింది.

తాజాగా వరంగల్‌లో వెయ్యి స్థంభాల గుడిని దర్శించుకున్న టీఎస్సార్‌ మీడియాతో మాట్లాడుతూ చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌ల మల్టీస్టారర్‌ విషయంలో తాను చాలా సీరియస్‌గా ఉన్నానని, ఇప్పటికే త్రివిక్రమ్‌ సగం కథను సిద్దం చేశాడని, త్వరలోనే పూర్తి కథను సిద్దం చేసి సినిమాను మొదలు పెట్టబోతున్నట్లుగా చెప్పుకొచ్చాడు. ఇప్పటి వరకు చిరంజీవి, పవన్‌, త్రివిక్రమ్‌లో ఏ ఒక్కరు కూడా సినిమా గురించి ప్రకటించింది లేదు. కాని సుబ్బిరామిరెడ్డి మాత్రం మల్టీస్టారర్‌ గురించి పదే పదే చెప్పడంతో అందరిలో ఆసక్తి నెలకొంది. చిరంజీవి, పవన్‌లు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు అంటూ చెబుతున్న సుబ్బిరామిరెడ్డి మాటలు నమ్మశక్యంగా లేవని కొందరు అంటున్నారు. మొత్తానికి మెగా మల్టీస్టారర్‌ వస్తే మాత్రం పండగే అని ఫ్యాన్స్‌ భావిస్తున్నారు. పవన్‌ ప్రస్తుతం తన పూర్తి దృష్టి రాజకీయాలు అని చెప్పిన నేపథ్యంలో మల్టీస్టారర్‌ సాధ్యం అవ్వడం కష్టమే అని కొందరి వాదన.