TG Politics: సంగారెడ్డి జిల్లాలో పేలుడు.. స్పందించిన KCR

TG Politics: Explosion in Sangareddy district.. KCR responded
TG Politics: Explosion in Sangareddy district.. KCR responded

సంగారెడ్డి జిల్లాలో పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 5 గురు మరణించారు. అయితే.. ఈ సంగారెడ్డి జిల్లాలో పేలుడు సంఘటనపై BRS అధినేత కేసీఆర్ స్పందించారు. సంగారెడ్డి జిల్లాలో ఓ పరిశ్రమలో జరిగిన పేలుడు వల్ల జరిగిన అగ్నిప్రమాదంలో పలువురు కార్మికులు మరణించడం పట్ల BRS అధినేత కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం ప్రకటించారు.

మరిణించిన వారి కుటుంబ సభ్యులకు KCR తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. పేలుడులో తీవ్రంగా గాయపడిన వారికి తక్షణమే మెరుగైన వైద్యం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.

సంగారెడ్డి ఫ్యాక్టరీలో మృతి చెందిన వారి వివరాలు..

1.రవి శర్మ, కంపెనీ డైరెక్టర్ హైదరాబాద్
2. విష్ణు చందాపూర్
3. సురేష్ పాల్ మధ్యప్రదేశ్,
4. దాయనంద్ తమిళనాడు,
5. సుబ్రమణ్యం ఆంద్రప్రదేశ్.