ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం

Today is Andhra Pradesh statehood day
Today is Andhra Pradesh statehood day

ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం అన్న సంగతి తెలిసిందే. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని చాలా ఘనంగా నిర్వహించాలని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా… ఇవాళ తాడేపల్లి లోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఉదయం 10 :16 గంటలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ వేడుకలు నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొంటారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం జాతీయ పతాకాన్నిసీఎం జగన్ ఆవిష్కరిస్తారు. ఈ సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డి తెలుగు తల్లికి అలాగే అమరాజీవి పొట్టి శ్రీరాములుకు నివాళులు అర్పించనున్నారు. ఇక ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు అలాగే ఇతర అధికారులు పాల్గొంటారు. అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా చాలా ఘనంగా జరుపనున్నాయి.