భారత్కు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరోక్షంగా హెచ్చరించారు. తాను మళ్లీ అధికారంలోకి రాగానే భారత్ పని పడతానని వ్యాఖ్యలు చేశారు. భారత్లో పన్ను రేట్లు అధికంగా ఉన్నాయంటూ మరోసారి ధ్వజమెత్తారు.భారత్ లో అమెరికా ఉత్పత్తులపైన ఎక్కువగా పన్ను విధిస్తోందని.. వచ్చే 2024 అధ్యక్ష ఎన్నికల్లో గెలిచి తాను అధికారాలు చేపడితే తాను కూడా భారతీయ వస్తువులపైన అదే స్థాయిలో పన్నులు విధిస్తానని హెచ్చరించారు.
ట్రంప్ 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారని విషయం తెలిసిందే. ముందుగా రిపబ్లికన్ ప్రైమరీ ఎన్నికల్లో ఆయన తన అదృష్టం పరీక్షించుకోనున్నారు. సర్వేల ప్రకారం చూస్తే.. రిపబ్లికన్ మద్దతుదారుల్లో 50 శాతానికి పైగా ట్రంప్కే అండగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వివిధ అంశాలపై తన అభిప్రాయాలు చెబుతున్న ట్రంప్.. తాజాగా ఫాక్స్ బిజినెస్ న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమెరికా పన్ను విధానాలపై మాట్లాడారు. ఈ సందర్భంగా భారత్ విధిస్తున్న పన్నులపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.