వెంకయ్య కొడుకు లో ఇంత భక్తి ?

venkaiah naidu son invites to governor narasimhan for Venkateswara Vaibhavam

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఎంత పబ్లిక్ పర్సన్ అనేది వేరే చెప్పక్కర్లేదు. కానీ ఆయన కొడుకు హర్షవర్ధన్ పూర్తిగా లో ప్రొఫైల్ లో వుంటారు. వెంకయ్య నిర్వహిస్తున్న స్వర్ణభారతి ట్రస్ట్ ఫంక్షన్స్ సమయం లోనూ వెంకయ్య కుమార్తె దీప వెంకట్ కనిపించినంత చురుగ్గా హర్షవర్ధన్ కనిపించరు. ఇక వెంకయ్య కుమార్తె అప్పుడప్పుడు మీడియాకి ఇంటర్వ్యూలు ఇవ్వడం చూసాం. కానీ హర్షవర్ధన్ గురించి హర్ష టొయోట షో రూమ్ ప్రస్తావన వస్తేనే బయటకు తెలుస్తుంది అన్నట్టు ఉండేవారు.

ఇటీవల ఓ నేషనల్ ఛానల్ కెసిఆర్ సర్కార్ పోలీసుల కోసం కొన్న వాహనాలకు సంబంధించి అవినీతి జరిగినట్టు ఓ వార్త బయట పెట్టింది. ఆ కొనుగోలు వెంకయ్య కుమారుడికి చెందిన వాహనాల ఏజెన్సీ ద్వారా జరిగినట్టు ఆ ఛానల్ రిపోర్ట్ చేయడంతో హర్షవర్ధన్ అనే కొడుకు వెంకయ్యకి ఉన్నట్టు చాలా మందికి తెలిసింది అని పొలిటికల్ సర్కిల్స్ లో జోక్ వేసుకునే వారు. అయితే అంత కామ్ గా వుండే హర్షవర్ధన్ ఇటీవల ఓ ఎపిసోడ్ లో పూర్తి యాక్టివ్ గా వుంటున్నారు. అదే… విజయవాడలో జరుగుతున్న వెంకటేశ్వర వైభవోత్సవం కార్యక్రమం. ఈ కార్యక్రమం మొదలు అయినప్పటినుంచి హర్షవర్ధన్ ఎంతో క్రియాశీలకంగా వుంటున్నారు. ఆయన స్వయంగా గవర్నర్ నరసింహన్ ని కలిసి ఆ ఉత్సవాలకు రావాల్సిందిగా ఆహ్వానం పలికారు. ఈరోజు తండ్రి వెంకయ్యతో కలిసి శ్రీవారి పూజల్లో పాల్గొన్నారు. ఇక విలేకరులకు స్వామి వారిని దర్శించుకోమని స్వయంగా హర్షవర్ధన్ పేరిట సందేశం కూడా పంపారు. మొత్తానికి వెంకయ్య కొడుకు యాక్టివ్ నెస్ చూస్తుంటే ఆయనకి భక్తి ఎక్కువని తెలుస్తోంది. అయితే ఆయన ఇక్కడితో ఆగుతారా లేక భవిష్యత్ లో రాజకీయాల్లోకి కూడా అడుగు పెడతారా అన్నది చూడాలి.

మరిన్ని వార్తలు

జగన్ పాదాభివందనం వెనుక …వైరల్ వీడియో

మాతృదినోత్సవం నాడు తండ్రికి వందనం…

బీజేపీ నేతలు అపర కీచకులు