Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఇటీవల టాలీవుడ్ స్టార్స్ బుల్లి తెర వెంట పరుగులు పెడుతున్నారు. నిన్న మొన్నటి వరకు బాలీవుడ్ స్టార్స్కు మాత్రమే బుల్లి తెర అంటే ప్రేమ ఉండేది. కాని ప్రస్తుతం తెలుగు స్టార్ హీరోలు కూడా బుల్లి తెరలో కనిపించాలని ఆశపడుతున్నారు. టాలీవుడ్ స్టార్స్లో మొదటగా బుల్లి తెరపై కనిపించింది నాగార్జున. మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమంతో నాగార్జున బుల్లి తెర ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత చిరంజీవి కూడా అదే షోతో ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఇక రానా నెం.1 యారి అనే టాక్ షోతో బుల్లి తెరపై కనిపిస్తున్నాడు. ఎన్టీఆర్ ‘బిగ్బాస్’కు హోస్ట్గా వ్యవహరిస్తున్న విషయం తెల్సిందే.
ఇలా స్టార్ హీరోలు బుల్లి తెరపై సందడి చేస్తున్న నేపథ్యంలో ప్రేక్షకులు థ్రిల్ ఫీల్ అవుతున్నారు. అందుకే ఎక్కువ మంది హీరోలు ఇంకా బుల్లి తెరపై కనిపించాలని ఆశపడుతున్నారు. ఆ క్రమంలోనే వెంకటేష్ త్వరలోనే ఒక టీవీ షోలో హోస్ట్గా కనిపించబోతున్నట్లుగా విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది. నిన్న మొన్న పవన్ కళ్యాణ్ మాజీ భార్య అయిన రేణు దేశాయ్ త్వరలో స్టార్ మాటీవీలో ప్రారంభం కాబోతున్న ఒక డాన్స్ షోలో కనిపించబోతుందని వార్తలు వచ్చాయి. ఆ వార్తలు ఇంకా కొనసాగుతున్న సమయంలోనే వెంకటేష్ బుల్లి తెరపై మెరవబోతున్నాడంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వెంకీ ఎలాంటి షోతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.
మరిన్ని వార్తలు: