వైరల్ గా మారిన విజయశాంతి ట్వీట్..!

Vijayashanti's tweet which has gone viral..!
Vijayashanti's tweet which has gone viral..!

సినీ నటి విజయశాంతి బీజేపీలో కొనసాగుతారా ? లేదా అని అనుమానాలు రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలుగా ఉన్న ఆమె.. గత కొంత కాలం నుంచి పార్టీపై అసంతృప్తిగా ఉన్నారు. తనకు పార్టీలు సరైన ప్రాధాన్యత లభించడం లేదని ఆమె భావిస్తున్నారు. ఇటీవల సోనియా గాంధీని తాను అభిమానిస్తానని ఆమె ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనే అనేక ఊహాగానాలు బయలుదేరాయి. తాజాగా ఆమె చేసిన మరో సుధీర్ఘ పోస్ట్ దానికి బలాన్ని చేకూరుస్తోంది. ఈ ట్వీట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారి, చర్చకు దారి తీసింది.

ఇది తెగింపుల సంగ్రామం, తెలంగాణ ఉద్యమకారుల తిరుగుబాటుతో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల మరో సార్వత్రిక స్వతంత్ర పోరాటం. తెలంగాణ బిడ్డలు ఇప్పటికే భార రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) బరువు దించుకోనీకి సన్నద్ధమయ్యారు అని ఆమె తన ట్వీట్ లో పేర్కొన్నారు. ఆ ఫలితాలే దుబ్బాక , గ్రేటర్ హైదరాబాద్, టీచర్స్ ఎమ్మెల్సీ, హుజూరాబాద్ ఇంకా, దగ్గర దగ్గరగా మునుగోడు, నాగార్జునసాగర్ మొదలైనవి. అయితే భార రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)ని ఓడగొట్టగలిగిన అభ్యర్ధిని గెలిపించి, లేదా గెలుపు వరకు తెచ్చిన విజ్ఞులైన తెలంగాణ ఓటర్లు, తమ ఓటు చీలకుండా , మూడో పార్టీ ప్రధాన పోటీలో లేనప్పుడు జాతీయ పార్టీ ఐనప్పటికి, డిపాజిట్ రాని స్ధాయికి కూడా ఆ పార్టీలను పరిమితం చేసినరు. అదే తెలంగాణ జన శ్రేణుల విచక్షణ.’’ అని విజయశాంతి తెలిపారు.