ప్రియుడితో ఏకాంతంగా ఉండగా భార్యా-ప్రియుడిని తగలబెట్టిన భర్త !

Wife Illegal Affair Her Boyfriend then Husband killed them in Nellore

ఈ మధ్య కాలంలో భార్యలు తమ భర్తలను మోసం చేసి వేరే వ్యక్తులతో అనైతిక సంభందాలు నేర్పుతున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. ఇటువంటి ఘటనలు రోజు రోజుకీ పెరుగుతున్నాయి తప్ప ఎక్కడా తగ్గడంలేదు. అయితే తన భార్య తనను మోసం చేసి మరో వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని కొనసాగించడం మాత్రం ఓ వ్యక్తి సహించలేకపోయాడు. భార్య, ప్రియుడు ఏకాంతంగా ఉన్న సమయంలో ఆ విషయాన్ని పసిగట్టి వారిని అంతమొందించాడు. తన భార్య, ఆమె ప్రియుడి ఇంట్లో ఉన్న సమయంలో బయటినుంచి గొళ్లెం పెట్టి ఏమాత్రం కనికరం చూపక వారి మీద పెట్రోల్‌ పోసి తగులబెట్టాడు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కోళ్లమిట్టలో చోటుచేసుకున్న ఈ ఘటన ఇప్పుడు జిల్లాలోనే కాక రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పోలీసుల వివరాల ప్రకారం కోళ్లమిట్టకు చెందిన హరిబాబుకు కవితకు ఐదేళ్ల కిందట పెళ్లయింది. కవితకు మరో వ్యక్తితో వివాహేతరం సంబంధం ఉంది. ఈ వివాహేతరం సంబంధం గురించి గతంలోనే తెలుసుకున్న హరిబాబు భార్యను చాలా సార్లు మందలించాడు.

ఈ విషయంలో భార్యాభర్తల మధ్య అనేక సార్లు గొడవలు జరిగాయి. ఒకసారి పెద్దల వద్ద పంచాయతీ పెట్టిన్చినా కవిత ధోరణిలో మార్పురాలేదు. ప్రియుడితో తిరిగి ఆమె వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న విషయాన్ని హరిబాబు గమనించాడు. ఈ క్రమంలో హరిబాబు బుధవారం బయటకు వెళ్లిన సమయంలో అతని ఇంటికి కవిత ప్రియుడు వచ్చాడు. కవిత, ఆమె ప్రియుడు ఇంట్లో ఏకాంతంగా ఉన్న సమయంలో హరిబాబు ఈ విషయం తెలిసిందే. వెంటనే ఇం‍టికి చేరుకున్న అతను… ఇద్దరు లోపల ఉన్న విషయాన్ని గుర్తించి బయట నుంచి గొళ్లెం పెట్టాడు. ఈ క్రమంలో పట్టరాని ఆగ్రహంతో హరిబాబు పెట్రోలో పోసి గుడిసెకు నిప్పటించినట్టు పోలీసులు తెలిపారు. అనంతరం అతను సంఘటనాస్థలం నుంచి పరారయ్యాడు. విషయం తెలియడంతో సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదుచేసి… నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనలో మహిళ, ఆమె ప్రియుడు ఇద్దరు సజీవ దహనమైపోయారు. వారు మృతదేహాలు గుర్తుపట్టరానంతగా దహనమయ్యాయి.