నానితో మళ్లీ కబడ్డీ ఆడిస్తానంటున్నాడు

Will-Nani-Act-Next-Film-Wit

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

నానితో ‘భీమిలి కబడ్డి జట్టు’ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు తాతినేని సత్య. ఈయన తాజాగా ‘వీడెవడు’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సచిన్‌ జ్యోషి హీరోగా తెరకెక్కిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో పెద్దగా అంచనాలు లేవు. అయినా సినిమా తప్పకుండా ఆకట్టుకుంటుందనే నమ్మకంతో దర్శకుడు ఉన్నాడు. ఈ సినిమా తర్వాత నానితో మరో సినిమా చేయబోతున్నట్లుగా తాతినేని సత్య చెబుతున్నాడు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఈ దర్శకుడు త్వరలోనే నానికి ఒక మంచి కథ చెప్పబోతున్నట్లుగా ప్రకటించాడు.

ప్రస్తుతం నాని రేంజ్‌ మామూలుగా లేదు. బడా నిర్మాతలు, పెద్ద దర్శకులు ఈయనతో సినిమాలు చేసేందుకు సిద్దం అవుతున్నారు. ప్రస్తుతం మూడు సినిమాలు కమిట్‌ అయిన నాని, మరి కొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. సౌత్‌ స్టార్‌ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో కూడా నాని ఒక సినిమాను చేస్తున్నాడు. ఇంతటి బిజీ షెడ్యూల్‌తో ఉన్న నాని ఒక ఫ్లాప్‌ దర్శకుడు అయిన తాతినేని సత్యకు ఓకే చెప్పడం దాదాపు అసాధ్యం. కాని తనకు మంచి పేరు తెచ్చిన ‘భీమిలి కబడ్డి జట్టు’ దర్శకుడు కనుక సత్యకు నాని ఛాన్స్‌ ఇస్తాడేమో చూడాలి.