కర్ణాటక ఎమ్మెల్యేలు ‘బలిసినోళ్ళు’ – జగన్ కు ఫిఫ్త్ ప్లేస్…!

YS Jagan Is Ranked 5th Among The Highest Earners In India

గత ఎన్నికల సందర్భంగా దేశం మొత్తం మీద 3,145 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు సమర్పించిన అఫిడవిట్ లను రీసెర్చ్ చేసిన అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) పలు ఆసక్తికర అంశాలను వెల్లడించింది. ఆ వివరాల ప్రకారం భారత్ లోని ఎమ్మెల్యేలందరిలో అత్యధికంగా సంపాదిస్తున్న వారిలో వైకాపా అధినేత వైఎస్ జగన్ 5వ స్థానంలో ఉన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా సంపాదిస్తున్నది జగనే. ఆయన వ్యక్తిగత ఆదాయం రూ. 13.32 కోట్లు కాగా, కుటుంబ ఆదాయం రూ. 18.13 కోట్లని ఏడీఆర్ వెల్లడించింది.

jagan
తరువాతి స్థానంలో నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్, రూ. 9.21 కోట్ల వ్యక్తిగత, రూ. 10.76 కోట్ల కుటుంబ ఆదాయంతో 8వ స్థానంలో ఉన్నారు.
తర్వాత స్థానంలో వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు రూ. 8.49 కోట్ల వ్యక్తిగత, రూ. 8.61 కోట్ల కుటుంబ ఆదాయంతో 10వ స్థానంలో ఉన్నారు.
కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి రూ. 6.48 కోట్ల వ్యక్తిగత ఆదాయంతో, రూ. 7.96 కోట్ల కుటుంబ ఆదాయంతో 14వ స్థానంలో ఉన్నారు.
భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, రూ. 4.85 కోట్ల వ్యక్తిగత, రూ. 5.54 కోట్ల కుటుంబ ఆదాయంతో 19వ స్థానంలో నిలిచారు.
ఇక అత్యల్ప ఆదాయం ఉన్న తెలుగు ఎమ్మెల్యేల విషయానికి వస్తే, శింగనమల ఎమ్మెల్యే బి.యామినీ బాల వ్యక్తిగత ఆదాయం 1,301 అని, కుటుంబ ఆదాయం కూడా అంతేనని ఏడీఆర్ పేర్కొంది.
దేశవ్యాప్తంగా దక్షిణాది ఎమ్మెల్యేలు శ్రీమంతులుగా ఉండగా, ఈశాన్య ఎమ్మెల్యేలు పేదలని ఏడీఆర్ వెల్లడించింది. దక్షిణాదిన ఉన్న 711 మంది ఎమ్మెల్యేల వార్షికాదాయం రూ. 51.99 లక్షలని, ఈశాన్య రాష్ట్రాల్లోని 614 మంది ఎమ్మెల్యేల వార్షికాదాయం రూ. 8.53 లక్షలని తెలిపింది.
139 మంది ఎమ్మెల్యేలు ఎనిమిదో తరగతి వరకూ మాత్రమే చదువుకున్నారని, వీరి ఆదాయం చాలా ఎక్కువని ఆసక్తికర నిజాన్ని వెల్లడించింది.

jagam-money
ప్రస్తుతం దేశంలో 50 ఏళ్ల లోపున్న ఎమ్మెల్యేల సంఖ్య 1,402గా ఉండగా, 80 ఏళ్లలోపు 1,727 మంది, 90 ఏళ్ల వరకూ వయసున్న వారు 11 మంది ఉన్నారని ఏడీఆర్ తెలిపింది. మొత్తం ఎమ్మెల్యేల్లో 8 శాతం మంది మాత్రమే మహిళలని పేర్కొంది.