ఆ యాత్రలో జగన్, పవన్ ఎదురు పడతారా ?

Ys jagan Pawan kalyan padayatra in andhra pradesh

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వైసీపీ అధినేత జగన్, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ త్వరలో ప్రజాక్షేత్రంలో ఢీకొట్టబోతున్నారు. ఇటీవల గుంటూరు, విజయవాడ మధ్య జరిగిన ప్లీనరీలో జగన్ తన పాదయాత్ర అక్టోబర్ నుంచి వుండబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. ఇక తాజాగా జనసేనాని పవన్ కూడా అక్టోబర్ నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరించబోతున్నట్టు తెలిపారు. అంటే ఇద్దరూ ఒకే టైం లో జనం తలుపులు తట్టబోతున్నారు. పవన్ కూడా సీరియస్ గా పాదయాత్ర గురించి ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.

జగన్, పవన్ ఒకే నెలలో పాదయత్రకి పూనుకుంటే ఏపీ లో ఒక్కసారిగా రాజకీయ సందడి నెలకొంటుంది. పోటాపోటీగా జనసమీకరణ జరిగే అవకాశం లేకపోలేదు. ఇక ప్రస్తుతం ఈ ఇద్దరూ అనుకుంటున్న షెడ్యూల్ , రూట్ మ్యాప్ ప్రకారం జగన్, పవన్ తమ పాదయాత్రలో ఎక్కడో చోట ఎదురు పడొచ్చు. అదే జరిగితే దాని పరిణామాల్ని అంచనా వేయడం కష్టం. అయినా ఓ సినీ నటుడిగా పవన్ కి వుండే క్రేజ్ వేరు. ఈ విషయం గ్రహించి పోలికలు వస్తాయన్న కారణంతో జగన్ తన పాదయాత్ర షెడ్యూల్ ని కాస్త వెనక్కి జరుపుకునే అవకాశం లేకపోలేదు.

మరిన్ని వార్తలు:

డ్రగ్స్ కేసులో పార్ట్ -2 ఉందా.. లేదా..?

పరువా.. పార్టీయా..? కోట్ల డైలమా

కేటీఆర్ ను టార్గెట్ చేసిన రేవంత్