ఏపీలో భారీ వర్షం.. SI పరీక్షలు వాయిదా..!

Heavy rain in AP.. SI exams postponed..!
Heavy rain in AP.. SI exams postponed..!

నేడు రాయలసీమ జోన్, ఏలూరు జోన్ లలో జరగాల్సిన ఎస్ఐ అభ్యర్థుల ఫిజికల్ పరీక్షలను భారీ వర్షం కారణంగా వాయిదా వేసినట్లు అధికారులు వెల్లడించారు. ఏలూరులో ఈ నెల 13న కర్నూలులో 22న నిర్వహిస్తామని తెలిపారు. కాగా, కర్నూలులో నిన్నటి పరీక్షలను ఈ నెల 21 కు వాయిదా వేసిన విషయం తెలిసిందే. వర్షం వల్ల గ్రౌండ్స్ చిత్తడిగా మారడంతో అభ్యర్థులకు ఇబ్బంది లేకుండా అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

కాగా, బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో నేటి నుంచి నాలుగు రోజులపాటు మోస్తారు నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఐఎండి తెలిపింది. శ్రీకాకుళం, VZM, అల్లూరి, ఏలూరు జిల్లాలో భారీ నుంచి అతిబారి వర్షాలు కురుస్తాయని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగిలిన జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ ఇచ్చింది. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.