టెన్త్ అమ్మాయి మీద సీనియర్లు రేప్ !

Girl Gang Raped In Guntur

ఎన్ని ‘నిర్భయ’లు వచ్చినా మహిళలపై జరుగుతున్నఅఘాయిత్యాలు ఆగడం లేదు. తాజాగా పదో తరగతి విద్యార్థినిపై ఆమె సీనియర్ విద్యార్థులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. డెహ్రాడూన్‌లోని ఓ బోర్డింగ్ స్కూల్‌లో చోటు చేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అందుతున్న సమాచరం ప్రకారం ఆగస్ట్ 15 వేడుకల రిహార్సల్స్ వంకతో ఆ బాలికను స్టోర్ రూంలోకి పిలిచి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు.

sex-partners

 

గత నెలలో ఈ సంఘటన చోటు చేసుకోగా బాలిక ఇప్పుడు అనారోగ్యంతో బాధపడుతుండడంతో తల్లిదండ్రులు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్ళారు. బాలికను పరీక్షించిన వైద్యులు గర్భవతి అని చెప్పడంతో వారు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. దీంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఘటనపై బాధితురాలి సోదరి, తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా పాఠశాలకు చెందిన నలుగురు సిబ్బందిని అత్యాచారానికి పాల్పడ్డ నలుగురు సీనియర్ విద్యార్ధులను అదుపులోకి తీసుకున్నారు.