AP Politics: భీమవరం టీడీపీ నేతలతో భేటీ అయినా పవన్ కళ్యాణ్

AP Politics: Pawan Kalyan meets Bhimavaram TDP leaders
AP Politics: Pawan Kalyan meets Bhimavaram TDP leaders

జనసేన అధినేత పవన్కల్యాణ్ భీమవరంలో పర్యటిస్తున్నారు. పట్టణంలో తెదేపా ముఖ్యనేతలతో ఆయన భేటీ అయ్యారు. తెదేపా జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే పులపర్తి ఆంజనేయుల ఇళ్లకు వెళ్లి కలిశారు. రానున్న ఎన్నికల్లో భీమవరంలో జనసేన-తెదేపా అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. దుష్టపాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడటమే మనందరి లక్ష్యమని చెప్పారు. అందరూ కలిసికట్టుగా పనిచేయాలన్నారు.

అంతకుముందు పవన్కు ఇరు పార్టీల నేతలు ఘనస్వాగతం పలికారు. పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. బుధవారం సాయంత్రం స్థానిక నిర్మలాదేవి ఫంక్షన్ హాల్లో జనసేన-తెదేపా నేతల సమావేశం జరగనుంది. భవిష్యత్ కార్యాచరణపై నేతలతో పవన్ చర్చించనున్నారు.