అక్కినేని షో కి బాలయ్య ఫ్యామిలీ.

Balayya family will watch naga chaitanya yuddham sharanam movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఒకప్పుడు తెలుగు సినీ రంగానికి ఎన్టీఆర్, అక్కినేని రెండు కళ్లుగా చెప్పుకునే వారు. అయినా అప్పట్లో ఆ ఇద్దరు మహా నటుల మధ్య విభేదాలు గురించి కూడా బాగానే ప్రచారం జరిగింది. అయితే విశేషం ఏమిటంటే ఆ ఇద్దరి నటుల మధ్య గొడవలు ఉన్నప్పటికీ ఆ రెండు కుటుంబాల సభ్యుల మధ్య మాత్రం మంచి సంబంధాలు ఉండేవి. కానీ కాలంతో పాటు చాలా మారిపోయాయి. నందమూరి నట వారసుడు బాలయ్య , అక్కినేని అందగాడు నాగార్జున మధ్య మాటలు కూడా లేకుండా పోయాయి. ఆ గొడవకి కారణం తెలియకపోయినా ఆ రెండు కుటుంబాల మధ్య సుహృద్భావ వాతావరణం వుండాలని తెలుగు సినీ పరిశ్రమ కోరుకుంటోంది అయితే పిల్లి మెడలో గంట కట్టేది ఎవరు అన్నట్టు ఆ బాధ్యత తీసుకోడానికి ముందుకొచ్చే ధైర్యం చేయలేకపోయారు. ఏళ్ళు గడిచేకొద్దీ ఆ ఆశ కూడా పోయింది. అయితే ఇన్నాళ్ళకి ఓ ప్రయత్నం జరిగింది.

నిర్మాత సాయి కొర్రపాటి నందమూరి బాలయ్యకి ఎంత సన్నిహితుడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన తాజాగా నాగ చైతన్య హీరోగా చేసిన యుద్ధం శరణం సినిమా రేపు విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ఈ సినిమా ప్రివ్యూ ఇటు ప్రసాద్ లాబ్స్ లో అటు అన్నపూర్ణ స్టూడియో లో ప్రివ్యూ థియేటర్ లో వేయబోతున్నారు. ప్రసాద్ లాబ్స్ లో వేస్తున్న షో కి బాలయ్య కుటుంబం వస్తుంటే, అన్నపూర్ణ లో నాగ్ కుటుంబం చూస్తోంది. ఏదేమైనా ఇప్పటిదాకా రెండు కుటుంబాల మధ్య పరిస్థితి తెలిసిన వారికి ఇప్పుడు నాగ చైతన్య సినిమా ని బాలయ్య చూడడం పెద్ద విశేషం గానే చెప్పుకుంటున్నారు. ఈ క్రెడిట్ మొత్తం నిర్మాత సాయి కొర్రపాటిదే అనుకోవాలి.

మరిన్ని వార్తలు:

కొడుకు కోసం పాక్‌కు వెళ్లబోతున్నాడట!

మేడ మీద అబ్బాయి… ప్రివ్యూ.

యుద్ధం శరణం… ప్రివ్యూ