Breaking News: ఇన్ఫోసిస్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..భారీగా పెరిగిన జీతాలు

Breaking News: Good news for Infosys employees ..heavily increased salaries
Breaking News: Good news for Infosys employees ..heavily increased salaries

ఇన్ఫోసిస్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్. కొత్త సంవత్సరానికి ముందే ప్రముఖ టెక్‌ దిగ్గజం ఇన్ఫోసిస్‌ ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. జీతాల పెంపుపై 5 నెలలుగా వాయిదా వేస్తూ వచ్చిన ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ తాజాగా జీతాల పెంపుపై స్పష్టత ఇచ్చింది. త్వరలో శాలరీలను హైక్‌ చేస్తున్నట్లు వెల్లడించింది.

పెరిగిన జీతాలు నవంబర్‌ 1 నుంచి అమలు అవుతాయని వెల్లడించింది. అయితే జీతాల పెంపు ఉద్యోగులందరికి వర్తించదని పేర్కొంది. 2021 అక్టోబర్‌ అనంతరం జూనియర్‌ స్థాయిలో సంస్థలో చేరిన ఉద్యోగులకు, 2021 అక్టోబర్ తర్వాత చేరిన మేనేజర్‌ స్థాయి ఉద్యోగులకు జీతాల పెంపు లిస్ట్‌లో చోటు దక్కలేదు. దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.