Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
-
ఏపీ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
-
ఉగాదికి ముందుగానే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు అందించింది.
-
డీఏ 2.096 శాతం విడుదల చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
-
2017 జనవరి నుంచి 2018 మార్చి వరకు దాదాపు 15 నెలల డీఏ కోసం రూ.1048 కోట్లు మంజూరు చేయాలని నిర్ణయం తీసుకుంది.
-
అలాగే పోలవరం కాంక్రీట్ పనులు చేపట్టిన నవయుగ కంపెనీకి రూ. 1244 కోట్ల పనులకు పరిపాలనా అనుమతులు మంజూరు చేశారు.
-
అంతేకాకుండా విద్యాధరపురంలో ఉర్దూ జూనియర్ కాలేజీకి ఎకరా స్థలం కేటాయించారు.
-
అలాగే ఏసీబీలో 350 పోస్టులు భర్తీ, గన్నవరం సీనియర్ సివిల్ జడ్జీ కోర్టుకు 25 పోస్టులు భర్తీ చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.