పవన్‌, త్రివిక్రంల మద్య విభేదాలా?

Cold war between Pawan kalyan and Trivikram

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ల మద్య స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరి  మధ్య సన్నిహిత్యం ఎంత గాఢంగా ఉంటుందో ఆయన సన్నిహితులకే కాకుండా, సినీ వర్గాల వారికి మరియు అభిమానులకు కూడా తెలుసు. పవన్‌కు అత్యంత ఆప్తుల్లో  త్రివిక్రమ్ ఒకడు అనే విషయం అందరికి తెలుసు. అయితే గత కొన్ని రోజులుగా పవన్‌ కళ్యాణ్‌కు త్రివిక్రమ్‌కు మధ్య విభేదాలు తలెత్తాయి అంటూ సోషల్‌ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అజ్ఞాతవాసి చిత్రం తర్వాత త్రివిక్రమ్‌ను పూర్తిగా పవన్‌ దూరం పెట్టాడు అంటూ కొందరు పుకార్లు పుట్టించారు. అందుకే తాజాగా నితిన్‌ ‘ఛల్‌ మోహన్‌ రంగ’ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుకలో త్రివిక్రమ్‌ పాల్గొనలేదు అంటూ చర్చ జరుగుతుంది.

సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారంకు ఎట్టకేలకు పవన్‌ సన్నిహితులు క్లారిటీ ఇచ్చారు. పవన్‌కు త్రివిక్రమ్‌కు మధ్య ఎలాంటి విభేదాలు లేవని, ఎప్పటికి ఇద్దరు మంచి మిత్రులు, చల్‌ మోహన్‌ రంగ వేడుకలో త్రివిక్రమ్‌ పాల్గొనక పోవడంకు కారణం తీవ్ర జ్వరం అని పవన్‌ సన్నిహితులు చెప్పుకొచ్చారు. గత కొన్ని రోజులుగా త్రివిక్రమ్‌ తీవ్రమైన వైరల్‌ ఫీవర్‌తో బాధపడుతున్నాడని, అందుకే ఆయన రావాలనుకున్నా కూడా పవన్‌, నితిన్‌ల మూవీ వేడుకకు రాలేదు అని చెప్పుకొచ్చారు. ఛల్‌ మోహన్‌ రంగ చిత్రంకు త్రివిక్రమ్‌ కూడా ఒక నిర్మాత అని మరోసారి వారు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఛల్‌ మోహన్‌రంగ చిత్రం విడుదలకు సిద్దం అవుతుంది. మరో వైపు ఎన్టీఆర్‌ తో ఒక చిత్రాన్ని తెరకెక్కించేందుకు త్రివిక్రమ్‌ సన్నాహాలు చేస్తున్నాడు. త్రివిక్రమ్‌ అనారోగ్యం కారణంగా కాస్త ఆలస్యంగా ఎన్టీఆర్‌ చిత్రం ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.