‘సాక్ష్యం’ కూడా చెప్పబోతున్న దిల్‌రాజు…

Dil Raju to Distribute Bellamkonda Srinivas Sakshyam movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
దిల్‌రాజు బ్యానర్‌లో తెరకెక్కుతున్న ‘శ్రీనివాసకళ్యాణం’ చిత్రం కోసం ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ చిత్రంతో పాటు మరో రెండు చిత్రాలను కూడా దిల్‌రాజు నిర్మిస్తూ చాలా బిజీగా ఉన్నాడు. నిర్మాతగా ఎంత బిజీగా ఉన్నా కూడా డిస్ట్రిబ్యూటర్‌గా మాత్రం తన జోరును కొనసాగించాలని దిల్‌రాజు భావిస్తున్నాడు. తాను ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది డిస్ట్రిబ్యూటర్‌గానే అవ్వడం వల్ల దాన్ని దిల్‌రాజు వదలి పెట్టడం లేదు. దిల్‌రాజు గతంలో ఎన్నో చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చి డిస్ట్రిబ్యూటర్‌గా భారీ లాభాలను దక్కించుకున్నాడు. దిల్‌రాజు డిస్ట్రిబ్యూట్‌ చేశాడు అంటూ సినిమా ఖచ్చితంగా సూపర్‌ హిట్‌ అనే టాక్‌ ఉంది. కాని ప్రస్తుతం దిల్‌రాజు డిస్ట్రిబ్యూషన్‌లో కాస్త శ్రద్ద తగ్గించినట్లుగా అనిపిస్తుంది.

ఇటీవలే ఈయన పూరి జగన్నాధ్‌ దర్శకత్వంలో రూపొందిన మెహబూబా చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్‌ చేయడం జరిగింది. ఆ సినిమాకు సంబంధించి దిల్‌రాజు ఏకంగా 6 కోట్ల రూపాయను నష్టపోయినట్లుగా సమాచారం అందుతుంది. పూరిపై నమ్మకంతో ఈ సినిమాను తీసుకున్నందుకు తగిన బుద్ది వచ్చిందని సన్నిహితుల వద్ద దిల్‌రాజు వాపోయినట్లుగా తెలుస్తోంది. దాంతో దిల్‌రాజు గుడ్డిగా ఇక సినిమాలు తీసుకోడు అంటూ ప్రచారం జరిగింది. ఇంతలో దిల్‌రాజు మరో సినిమాను తీసుకుని అందరిని ఆశ్చర్య పర్చాడు. బెల్లంకొండ సురేష్‌ తనయుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోగా తెరకెక్కుతున్న ‘సాక్ష్యం’ చిత్రాన్ని ఈయన పంపిణీ చేసేందుకు సిద్దం అయ్యాడు. నైజాం ఏరియాలో ఈ చిత్రాన్ని భారీ మొత్తానికి దిల్‌రాజు కొనుగోలు చేయడం జరిగింది. శ్రీవాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేవు. అయినా కూడా సినిమాను దిల్‌రాజు తీసుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉంది.