Election Updates: టీడీపీలో చేరనున్న వైసీపీ ఎమ్మెల్యే వసంత..!

Election Updates: YCP MLA Vasantha to join TDP!
Election Updates: YCP MLA Vasantha to join TDP!

వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పార్టీ మారేందుకు సిద్ధం అయ్యారు. 2 లేదా 3 రోజుల్లో వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరనున్నారు. ఇందులో భాగంగానే మైలవరంలో ఎమ్మెల్యే వసంత స్పీడు పెంచారు. ఇప్పటికే మైలవరం నుంచి పోటీకి టీడీపీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు చెబుతోంది వసంత వర్గం.

నిన్న మైలవరం టీడీపీ మండల పార్టీ నేతలతో టెలీ కాన్ఫరెన్స్ లో మాట్లాడిన వసంత, విబేధాలు పక్కన పెట్టి కలిసి చేద్దామని నేతలతో చెప్పారట. ఇవాళ మైలవరంలో కొందరు టీడీపీ నేతల ఇంటికి వెళ్లి వ్యక్తిగతంగా కలవనున్నారు వసంత. ఇప్పటికే ఇక్కడ టికెట్ ఆశించిన మాజీ మంత్రి దేవినేని ఉమాను చంద్రబాబు పిలిచి మాట్లాడారు. పార్టీ కోసం పనిచేసిన తనకు టికెట్ ఇవ్వాలని నిన్న ఆత్మీయ సమావేశం పెట్టారు బొమ్మసాని సుబ్బారావు. కానీ మైలవరం టికెట్‌ వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కు ఇచ్చేందుకు చంద్రబాబు డిసైడ్‌ అయ్యారట. దీంతో 2 లేదా 3 రోజుల్లో వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరనున్నారు.