అవిపుకార్లే.. క్లారిటీ ఇచ్చిన గోపీచంద్‌

Gopichand Provided By Clarity About Pantham

గోపీచంద్‌ హీరోగా నటించిన ‘పంతం’ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గోపీచంద్‌ 25వ చిత్రంగా తెరకెక్కిన ‘పంతం’ చిత్రంకు చక్రవర్తి దర్శకత్వం వహించాడు. విభిన్న చిత్రంగా ప్రేక్షకులను అలరిస్తుందంటూ మొదటి నుండి చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రచారం చేస్తూ వస్తున్నారు. నేడు చిత్రం విడుదలైన తర్వాత సినిమాకు పాజిటివ్‌ రెస్పాన్స్‌ వస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ చిత్రం తర్వాత గోపీచంద్‌ తన తదుపరి చిత్రాన్ని చంద్రశేఖర్‌ యేలేటి దర్శకత్వంలో చేయబోతున్నట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన రెండు చిత్రాలు కూడా విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. అందుకే వీరి కాంబో మూవీపై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. తాజాగా మీడియాలో వస్తున్న వార్తలపై గోపీచంద్‌ క్లారిటీ ఇచ్చాడు.

చంద్రశేఖర్‌ యేలేటితో మూడవ సినిమాకు స్క్రిప్ట్‌ రెడీ అవుతున్నట్లుగా మీడియాలో వస్తున్న వార్తలు నిజం కాదని, అసలు అలాంటి ఆలోచన తనకు లేదని, ఇప్పటి వరకు చంద్రశేఖర్‌ గారు కూడా నన్ను కలిసి స్టోరీ లైన్‌ కూడా చెప్పలేదు అని, లేని పోని పుకార్లు పుట్టించి వాటిని పబ్లిసిటీ చేయడం వృదా ప్రయాస అంటూ గోపీచంద్‌ చెప్పుకొచ్చాడు. తన తదుపరి చిత్రానికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని, అయితే అది చంద్రశేఖర్‌ యేలేటి దర్శకత్వంలో ఉండదంటూ మరోసారి చెప్పుకొచ్చాడు. త్వరలోనే గోపీచంద్‌ 26వ చిత్రం ప్రకటించే అవకాశం ఉంది. పంతం ఫలితంతో గోపీచంద్‌ కాస్త జోరు పెంచే అవకాశం ఉంది. మరో వైపు చంద్రశేఖర్‌ యేలేటి మొన్నటి వరకు నాగచైతన్యతో ఒక చిత్రం చేయబోతున్నట్లుగా ప్రచారం జరిగింది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం నాని హీరోగా చంద్రశేఖర్‌ యేలేటి చిత్రం రూపొందబోతుంది.