అప్పుడు తస్మదీయులు.. ఇప్పుడు అస్మదీయులు

Hindupur TDP Revolts Against Balayya PA

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

నందమూరి బాలాకృష్ణ భోళా మనిషని అందరికీ తెలుసు. ఆయనకు ఆగ్రహం ఎప్పుడో కానీ రాదు. వచ్చిందంటే మాత్రం ఇక ఆగరు. అలాంటి బాలకృష్ణ సహజంగా అందరితో సరాదాగా ఉంటారు. ఎమ్మెల్యే అయినా ఆ హోదా చూపించరు. అందుకే బాలయ్యను అందరూ లైట్ తీసుకుంటున్నారనే వాదన వస్తోంది. బాలకృష్ణ సినిమాల్లో బిజీగా ఉంటున్నారని తెలిసి.. తమ్ముళ్లంతా హిందూపురంలో హల్చల్ చేస్తున్నారట. తమకు నామినేటెడ్ పదవులు రావడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

నామినేటెడ్ పదవుల పంపకం మొదలవడంతో.. తమనూ ఓ చూపు చూడాలని చోటామోటా నేతలు బాలకృష్ణను కోరుతున్నారట. ఏదోలా బాబుతో మాట్లాడి తమకు పదవులు ఇప్పించాలని చెబుతున్నారట. అసలు ఇప్పటిదాకా జనంలో కనిపించని నేతలే ఎక్కువగా అడుగుతున్నారని, ఎప్పుడూ కష్టపడి పనిచేసే నేతలు మాత్రం కామ్ గానే ఉన్నారని బాలకృష్ణకు తెలిసిపోయింది. దీంతో ఆయన ఈ మ్యాటర్ ను తనదైన శైలిలో డీల్ చేయాలని డిసైడయ్యారట. పదవుల కోసం ఎవరూ వెంపర్లాడొద్దని ఇప్పటికే చిన్నపాటి వార్నింగ్ ఇచ్చారట.

గతంలో పీఏ హడావిడి సమయంలో కూడా బాలకృష్ణ వెంటనే స్పందించి అతడ్ని మార్చేశారు. మొన్నటికి మొన్న వైసీపీ వాళ్లు విచిత్రవేషధారణతో తనపై నిరసన తెలపడంపైనా బాలకృష్ణ స్థానిక నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారట. నిధులు తెచ్చిస్తున్నా.. పనులు ఎందుకు చేయడం లేదని నిలదీశారట. పదవులపై ఫోకస్ తగ్గించి పని చేయాలని గట్టిగా చెప్పారట. దీంతో బాలయ్యకు కోపం తెప్పించడం ఎందుకని నేతలంతా సైలంటయ్యారట.

మరిన్ని వార్తలు:

జేసీ ఏంటీ పిచ్చి ఆలోచన..?