‘మహానటి’కి అరుదైన రికార్డు

Mahanati Achieved Rare Record In Overseas

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’ చిత్రం విడుదలై సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈమద్య కాలంలో విడుదల అయిన సినిమాలు ఏవి అయినా కూడా మొదటి రెండు వారాల్లోనే భారీగా వసూళ్లు సాధిస్తూ ఉన్నాయి. సూపర్‌ హిట్‌ సాధించిన చిత్రాలు కూడా కేవలం రెండు వారాలు మాత్రమే కలెక్షన్స్‌ను రాబడుతున్నాయి. ఆ తర్వాత పూర్తిగా డల్‌ అవుతున్నాయి. కాని ‘మహానటి’ చిత్రం మాత్రం మూడవ వారంలో కూడా కుమ్ముడు కుమ్ముతోంది. మూడవ వారం వారాంతంలో కూడా పు థియేటర్లలో హౌస్‌ ఫుల్‌ కలెక్షన్స్‌ నమోదు అవుతున్నాయి. ఒక సినిమాకు మూడవ మరియు నాల్గవ వారంలో కలెక్షన్స్‌ హౌస్‌ ఫుల్‌ అవ్వడం ఈమద్య కాలంలో చాలా చాలా అరుదు.

‘బాహుబలి’ వంటి సినిమా కూడా కేవలం రెండు వారాల పాటు దుమ్ము దుమ్ముగా కలెక్షన్స్‌ను సాధించింది, కాని మూడవ వారం నుండి అంతగా షేర్‌ను రాబట్టలేక పోయింది. ఇక సావిత్రి చిత్రం 26 రోజులకు గాను ఏకంగా 26 కోట్ల షేర్‌ను తెలుగు రాష్ట్రాల్లో సాధించి అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. తెలుగు రాష్ట్రాతో పాటు ఓవర్సీస్‌ మరియు తమిళనాట కూడా ఈ చిత్రం మంచి వసూళ్లను సాధిస్తూ దూసుకు పోతుంది. భారీ వసూళ్లు నమోదు అవ్వడం ఖాయం అంటూ అంతా భావించారు. కాని మరీ ఇంత భారీ వసూళ్లు వస్తాయని ఆశించలేదు అంటూ నిర్మాతలు కూడా అంటున్నారు. ఈ చిత్రం వల్ల నిర్మాతలకు ఏకంగా 50 కోట్ల మేరకు లాభం వచ్చి ఉంటుందనే టాక్‌ వినిపిస్తుంది. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో కీర్తి సురేష్‌ హీరోయిన్‌గా నటించిన విషయం తెల్సిందే. సమంత, విజయ్‌ దేవరకొండ కీలక పాత్రల్లో కనిపించారు.