మహానటి స్వీట్‌ బాక్స్‌

Mahanati Team sends Cashew nuts Sweet Box to Tollywood celebrities

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘మహానటి’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’ చిత్రం రేపు విడుదల కాబోతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్‌ సభ్యులు సినిమా పరిశ్రమ ప్రముఖులకు సావిత్రి గారికి ఇష్టమైన స్వీట్‌ను పంపించి సినిమాకు బెస్ట్‌ విషెష్‌ను కోరడం జరిగింది. సావిత్రి గారికి జీడిపప్పు మిఠాయి అంటే చాలా ఇష్టం. ఆమె ప్రతి రోజు కూడా ఆ మిఠాయి తినేవారు అంటూ సావిత్రి గారితో సన్నిహిత్యం ఉన్న వారు అంటూ ఉంటారు. అందుకే సినిమా పరిశ్రమలో దాదాపు 200 మంది ప్రముఖులకు జీడిపప్పు మిఠాయి బాక్స్‌లను చిత్ర యూనిట్‌ సభ్యులు పంపించినట్లుగా తెలుస్తోంది.

చిత్ర యూనిట్‌ సభ్యులందరికి మరియు మీడియా వారికి కూడా సావిత్రికి ఇష్టమైన స్వీట్‌ను బహుమతిగా ఇవ్వడం జరిగింది. అప్పట్లో సావిత్రి ఏదైనా సినిమా పూర్తి చేసినప్పుడు తన సహాయకులకు మరియు చిత్ర కింది స్థాయి సిబ్బందికి చిన్న చిన్న గిఫ్ట్‌లు మరియు జీడిపప్పు మిఠాయిని ఇచ్చేది. అందుకే ఇప్పుడు ఆమె జ్ఞాపకార్థం ఆ మిఠాయిని ఇస్తున్నట్లుగా చిత్ర ప్రొడక్షన్‌ హౌస్‌ వారు చెప్పుకొచ్చారు. సావిత్రి జీవితాన్ని కల్లకు కట్టినట్లుగా చూపించేందుకు తన వంతు ప్రయత్నం చేశాను అని తప్పకుండా సినిమా ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉందని దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ చెబుతున్నాడు.