‘మంత్ ఆఫ్ మధు’ ఓటిటి రైట్స్ సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థ

‘మంత్ ఆఫ్ మధు’ ఓటిటి రైట్స్ సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థ
Cinema News

స్వాతిరెడ్డి, నవీన్ చంద్ర ప్రధాన పాత్రల్లో యువ దర్శకుడు శ్రీకాంత్ నాగోతి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ లవ్, ఫ్యామిలీ, ఎమోషనల్ ఎంటర్టైనర్ సినిమా మంత్ ఆఫ్ మధు. శ్రేయ నవేలి కీలక పాత్రలో కనిపించిన ఈ సినిమా ని క్రిశివ్ ప్రొడక్షన్ మరియు హ్యాండ్ పిక్డ్ స్టోరీస్ సంస్థలు నిర్మించగా అచ్చు రాజమణి సంగీతం అందించారు. ఇటీవల ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ సినిమా అందరినీ ఆకట్టుకుని మంచి విజయాన్ని అందుకుంది.

‘మంత్ ఆఫ్ మధు’ ఓటిటి రైట్స్ సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థ
Month of Madhu

ఇక తాజాగా ఈ సినిమా యొక్క ఓటిటి రైట్స్ ని ప్రముఖ ఓటిటి సంస్థ ఆహా వారు సొంతం చేసుకున్నారు. కాగా ఈ మూవీ యొక్క ప్రీమియర్ డేట్ ని రేపు ఉదయం 10 గం. లకు ఆహా టీమ్ అనౌన్స్ చేయనుంది. హర్ష చెముడు, మంజుల ఘట్టమనేని, జ్ఞానేశ్వరి కాండ్రేగుల, రాజా చెంబోలు, రాజా రవీంద్ర, రుద్ర రాఘవ్, రుచితా సాదినేని, మౌర్య సిద్దవరం, కంచెరపాలెం కిషోర్ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. మరి మంత్ ఆఫ్ మధు ఎంతమేర ఓటిటి ఆడియన్స్ ని మెప్పిస్తుందో చూడాలి.