ఈసారి మల్టీస్టారర్‌ దాగుడు మూతలు

nani-and-sharwanand-multi-starrer-new-movie-daagudu-moothalu

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

‘మిరపకాయ్‌’, ‘గబ్బర్‌సింగ్‌’ చిత్రాలతో స్టార్‌ దర్శకుడిగా మారిపోయిన హరీష్‌ శంకర్‌ ‘రామయ్యా వస్తావయ్యా’ చిత్రంతో ఫ్లాప్‌ అయ్యాడు. ఆ సినిమా తర్వాత మళ్లీ స్టార్‌ హీరోలు ఈయన దర్శకత్వంలో చేసేందుకు కాస్త వెనుకంజ వేశారు. ఆ సమయంలో మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌తో ‘సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌’ చిత్రాన్ని తెరకెక్కించి ఆకట్టుకున్నాడు. ఆ సినిమా తర్వాత అల్లు అర్జున్‌ అవకాశం ఇచ్చాడు. ‘డీజే’ చిత్రంతో బన్నీకి కెరీర్‌లోనే ది బెస్ట్‌ చిత్రాన్ని ఇచ్చాడు. నిన్న మొన్నటి వరకు డీజే సందడి కొనసాగుతూనే ఉంది. ఆ సినిమా పూర్తి అయ్యిందో లేదో వెంటనే మరో సినిమా పనిలో దర్శకుడు పడిపోయాడు.

ఇటీవలే అమెరికాలో తాను తర్వాత సినిమా కోసం లొకేషన్స్‌ వేటలో ఉన్నట్లుగా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. ఆ సినిమా హీరో ఎవరు కథ ఏంటి అనే విషయమై చెప్పలేదు. తాజాగా ఆ విషయంపై ఒక క్లారిటీ వచ్చింది. ఈసారి దర్శకుడు హరీష్‌ శంకర్‌ ‘దాగుడు మూతలు’ను యువ హీరోు నాని, శర్వానంద్‌లతో ఆడివ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. ఒక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ‘దాగుడు మూతల’ చిత్రం ఉండబోతుంది. ఇప్పటికే కథ సిద్దం అయ్యింది. త్వరలోనే సెట్స్‌ పైకి తీసుకు వెళ్లాలని భావిస్తున్నాడు. అయితే నాని మరియు శర్వానంద్‌లు వారి వారి సినిమాలతో బిజీగా ఉన్నారు. వచ్చే సంవత్సరం ఆరంభం వరకు వీరిద్దరు బిజీగా ఉన్నారు. కనుక సినిమా వచ్చే సంవత్సరం జనవరి లేదా ఫిబ్రవరిలో ప్రారంభించి సమ్మర్‌ చివర్లో సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు:

శింబు ఓవియాతో పెళ్లా…?

సాయి పల్లవి రాములమ్మ ఏంట్రా?