సోదరి కోసం నందమూరి బ్రదర్స్‌ రంగంలోకి దిగనున్నారా?

10. సోదరి కోసం నందమూరి బ్రదర్స్‌ రంగంలోకి దిగనున్నారా?

నందమూరి హరికృష్ణ కూతురు సుహాసిని తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోటీలో నిలువబోతున్న విషయం తెల్సిందే. కూకట్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గ సీటును టీడీపీ తరపున సుహాసినికి ఇవ్వాలని చంద్రబాబు నాయుడు నిర్ణయించుకున్న నేపథ్యంలో సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది. సుహాసినిని పోటీకి దించుతే ఖచ్చితంగా ఎన్టీఆర్‌ మరియు కళ్యాణ్‌ రామ్‌లు ప్రచారం చేయాల్సిందే. తమ సోదరి కోసం అయినా తెలుగు దేశం కోసం వారు ప్రచారం చేస్తారు అనేది చంద్రబాబు నాయుడు ఎత్తుగడ అంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. భారీ ఎత్తున కూకట్‌పల్లిలో సెటిలర్స్‌ ఉంటారు. ఆ సెటిలర్స్‌ ఓట్లను ఆకర్షించాలి అంటే అది ఎన్టీఆర్‌ వల్లే సాధ్యం అంటూ తెలుగు దేశం నాయకులు భావిస్తున్నారు.

సోదరి కోసం నందమూరి బ్రదర్స్‌ రంగంలోకి దిగనున్నారా? - Telugu Bullet

తెలుగు దేశం పార్టీ తెలంగాణలో బతకాలనే ఉద్దేశ్యంతో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడం జరిగింది. కాంగ్రెస్‌ ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తూ అతి తక్కువ స్థానాలను మాత్రమే తెలుగు దేశంకు ఇవ్వడం జరిగింది. దాంతో దక్కిన స్థానాలను అయినా పదింగా కాపాడుకుని గెవాలనే పట్టుదలతో తెలుగు తమ్ముళ్లు ఉన్నారు. అందుకే తెలుగు దేశం పార్టీ పోటీ చేసిన ప్రతి చోట కూడా ఈ నందమూరి బ్రదర్స్‌తో ప్రచారం చేయించాలని చంద్రబాబును తెలుగు తమ్ముళ్లు కోరుతున్నారు. కాని అది సాద్యం అయ్యే విషయం కాదు. ఎందుకంటే తమ సోదరి సుహాసినికి అయితే వారు మద్దతుగా ప్రచారం చేస్తారేమో కాని ఇతర అభ్యర్థులకు వారు మద్దతు తెలపడం అనుమానమే అంటున్నారు. మొత్తానికి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఈ నందమూరి బ్రదర్స్‌ పాల్గొనడం ఖాయంగా కనిపిస్తోంది.