అజ్ఞాతవాసులకు ఎన్టీఆర్‌, వెంకీ ఓదార్పు

ntr and venkatesh phone call to trivikram and producer radhakrishna

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

పవన్‌ కళ్యాణ్‌ హీరోగా నటించిన అజ్ఞాతవాసి చిత్రం బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడటం జరిగింది. భారీ అంచనాల నడుమ రూపొందిన అజ్ఞాతవాసి మరీ దారుణంగా ఫ్లాప్‌ అవ్వడంతో ఫ్యాన్స్‌ అంతా కూడా త్రివిక్రమ్‌పై పడుతున్నారు. పవన్‌ వంటి స్టార్‌ హీరోతో ఇలాంటి చెత్త సినిమా తీయడం ఏంటని, చిల్లరగా పవన్‌తో కామెడీ చేయించడం, సీరియస్‌గా సాగాల్సిన కథనంను సిల్లీగా తీసుకు వెళ్లడం ఏంటీ అంటూ దర్శకుడు త్రివిక్రమ్‌ను ఫ్యాన్స్‌ తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. సినిమా ఫ్లాప్‌కు పూర్తి కారణం త్రివిక్రమ్‌ అంటూ ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. పవన్‌, త్రివిక్రమ్‌ల కాంబో మూవీ అంటే అంచనాలు భారీగా పెంచుకుని సినిమా ఫ్లాప్‌ అవ్వడంతో ఇప్పుడు ఫ్యాన్స్‌ షాక్‌ అయ్యారు. ఇక పవన్‌తో సినిమా తర్వాత ఎన్టీఆర్‌ మరియు వెంకటేష్‌లతో త్రివిక్రమ్‌ సినిమా చేయాల్సి ఉంది.

అజ్ఞాతవాసి చిత్రం ఫ్లాప్‌ అనే టాక్‌ రాగానే ఎన్టీఆర్‌ ఆలోచనలో పడ్డాడు అంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. ఇప్పటికే సిద్దం అయిన స్క్రిప్ట్‌లో మార్పులు చేర్పులు సూచించాలని భావిస్తున్నాడు అంటూ ఎన్టీఆర్‌ గురించి మీడియాలో రకరకాలుగా ప్రచారం జరిగింది. కాని అసలు విషయం ఏంటీ అంటే అజ్ఞాతవాసి గురించి ఏమాత్రం పట్టించుకోకుండా ఎన్టీఆర్‌ తన తర్వాత సినిమాను త్రివిక్రమ్‌తోనే చేయబోతున్నాడు అని, పూర్తి నమ్మకం ఉంచి ఆయన చెప్పిన స్క్రిప్ట్‌తోనే సినిమాను చేయాలని ఎన్టీఆర్‌ భావిస్తున్నాడట.

సినిమా ఫలితం తేలిపోవడంతో ఎన్టీఆర్‌ మరియు వెంకటేష్‌లు స్వయంగా నిర్మాత రాధాకృష్ణకు ఫోన్‌ చేసి అజ్ఞాతవాసి సినిమా ఫ్లాప్‌ను పట్టించుకోకుండా తర్వాత సినిమాలపై దృష్టి పెట్టాలని, విమర్శలను పట్టించుకోకుండా ముందుకు వెళ్లాలి అంటూ దర్శకుడు త్రివిక్రమ్‌ మరియు నిర్మాత రాధా కృష్ణలను ఎన్టీఆర్‌ మరియు వెంకటేష్‌ు ఓదార్చినట్లుగా సినీ వర్గాల వారు చెబుతున్నారు. వెంకటేష్‌ నిర్మాత రాధాకృష్ణతో మాట్లాడగా, ఎన్టీఆర్‌ మాత్రం స్వయంగా త్రివిక్రమ్‌తో మాట్లాడటం జరిగింది. ఎన్టీఆర్‌, వెంకటేష్‌లతో త్రివిక్రమ్‌ చేయబోతున్న చిత్రాలను రాధాకృష్ణ నిర్మించబోతున్న విషయం తెల్సిందే. అందుకే ఇద్దరు కూడా నిర్మాత రాధాకృష్ణను కూడా పరామర్శించారు.