రాజకీయాలకు కాస్తా విరామం ఇచ్చిన పవన్.. కారణం అదే.

Pawan Kalyan
Pawan Kalyan

పవన్ రాజకీయాలకు కాస్తా బ్రేక్ ఇచ్చారు. తాత్కాలిక విరామాన్ని ప్రకటించారు. మొన్నటి వరకు వారాహి యాత్ర తో బిజీగా గడిపారు. ఇప్పుడు పెండింగ్లో ఉన్న సినిమాలపై ఫోకస్ పెట్టారు. వీలైనంత త్వరగా వాటిని పూర్తి చేసి.. పూర్తిస్థాయి పాలిటిక్స్ పై దృష్టి పెట్టాలని భావిస్తున్నారు.సెప్టెంబర్, అక్టోబర్లో సినిమాలను పూర్తి చేసి నవంబరు నుంచి ఎన్నికల గోదాలోకి దిగనున్నారు.

ప్రస్తుతం ముంబాయిలో పవన్ నటిస్తున్న ఓజి సినిమా షూటింగ్ కొద్ది రోజుల కిందట ప్రారంభమైంది. ఇప్పటికే యూనిట్ వరుసగా నాలుగు షెడ్యూల్ ను పూర్తి చేసింది. అంటే సుమారుగా 60 శాతం మేర కంప్లీట్ అయింది. సాహో ,రన్ రాజా రన్ చిత్రాల దర్శకుడు సుజిత్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. నిర్మాత డివివి దానయ్య భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హస్మి కీలక పాత్రలో , తమిళ నటి ప్రియాక అరుల్ హీరోయిన్ నటిస్తున్నారు. ఈ సినిమాను డిసెంబర్ లో క్రిస్మస్ కానుకగా విడుదల చేయడానికి చిత్ర యూనిట్ నిర్ణయించింది.

ఈ సినిమాకి సంబంధించి అక్టోబర్ లో 20 రోజుల పాటు షూటింగ్ బ్యాంకాక్ లో ఉంటుందని, నవంబర్లో ఎనిమిది రోజులు పాటు పవన్ కళ్యాణ్ ఈ సినిమాను పూర్తి చేయడానికి డేట్స్ ఇచ్చారని తెలుస్తోంది. అక్టోబర్, నవంబర్ లో పవన్ సినిమా షూటింగుల్లో పాల్గొంటారు. దీంతో రాజకీయ కార్యకలాపాలు తగ్గే అవకాశం ఉంది.

పవన్ పూర్తిస్థాయిలో రాజకీయాలపై నవంబర్ నుంచి ఫోకస్ పెడతారని సమాచారం. అప్పటికే రాష్ట్రంలో ఎన్నికల ఫీవర్ నడుస్తుంది.ఇటు క్షేత్రస్థాయిలో పర్యటనలు, అటు పొత్తుల వ్యూహాలు చేయాల్సి ఉండడంతో.. సినిమాలకు బ్రేకప్ ఇస్తారని సమాచారం. పవన్ సినిమాలకు దాదాపు మే, జూన్ వరకు ఫుల్ స్టాప్ పెట్టే అవకాశాలున్నట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి. పవన్ పై ఉన్న క్రేజ్ దృష్ట్యా కీలక ప్రాజెక్టులకు సంబంధించి నిర్మాతలు సైతం.. ఆయన కోసం వేచి చూసేందుకు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.