డ్రగ్స్‌ కేసు : స్టార్స్‌కు డేట్లు ఇచ్చిన పోలీసులు

policies giving notices to tollywood celebrities in drug case for interrogation

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
టాలీవుడ్‌లో పలువురు స్టార్స్‌ డ్రగ్స్‌ వాడుతున్నట్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే 12 మందికి పోలీసులు విచారణకు హాజరు కావాల్సిందిగా డేట్లు ఇవ్వడం జరిగింది. రోజుకు ఒక్కరు లేదా ఇద్దరు చొప్పున విచారణకు హాజరు కానున్నారు. ఒక్కరినే రోజంతా కూడా విచారించే అవకాశం ఉంది. పలువురు అధికారులు ఒక్కొక్కరిని విచారించనున్నట్లుగా పోలీసు వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. అంతా భావిస్తున్నట్లుగానే దర్శకుడు పూరి జగన్నాధ్‌ను మొదట కాస్త డెప్త్‌గా విచారించనున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఛార్మి మరియు ఇతర నోటీసులు అందుకున్న వారందరిని కూడా పోలీసులు విచారించనున్నారు. కొందరు ముఖ్యులను స్వయంగా అకున్‌ సబర్వాల్‌ విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

పూరి జగన్నాథ్‌ 19వ తారీకున
చార్మి 20వ తారీకున
ముమైత్‌ఖాన్‌ 21వ తారీకున
తరుణ్‌ 22వ తారీకున
శ్యామ్‌ కె నాయుడు 23వ తారీకున
ఆర్ట్‌ డైరెక్టర్‌ చిన్నా 25వ తారీకున 
నవదీప్‌ 26వ తారీకున
సుబ్బరాజు  27వ తారీకున
నందు, రవితేజ 28వ తారీకున
తనీష్‌ 28 వ తారీకున

మరిన్ని వార్తలు 

పిక్‌టాక్‌ : మళ్లీ మనస్సు దోచుకుంది

మెగా మూవీని చుట్టేశారా?

పూరి నోరు విప్పితే టాలీవుడ్‌ షేక్‌..!