ప్రభాస్, నాగ్ అశ్విన్ కలయికలో వస్తున్న సినిమా

ప్రభాస్, నాగ్ అశ్విన్ కలయికలో వస్తున్న సినిమా

ప్రభాస్ – నాగ్ అశ్విన్ కలయికలో వస్తోన్న సినిమా షూటింగ్ ను మొదట ఈ ఏడాది ఆఖర్లో మొదలుపెట్టాలని, అప్పటివరకూ ప్రీ ప్రొడక్షన్ కి సంబంధించిన వర్క్ మొత్తాన్ని పూర్తి చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ కరోనా దెబ్బతో వర్క్ మొత్తం పోస్ట్ ఫోన్ అయింది.దాంతో ఈ సినిమా షూటింగ్ ను వాయిదా వేయబోతున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుండి షూట్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ నిర్మించనున్నారు. కాగా సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రానున్న ఈ చిత్రంలో ప్రభాస్ సూపర్ హీరోగా నటిస్తున్నాడట.

ఈ చిత్రం కోసం భారీ తారాగణాన్ని తీసుకుంటున్నారు. ముఖ్యంగా హీరోయిన్ పాత్ర కోసం ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకొనేను తీసుకునే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. నాగ్ అశ్విన్ తన గత చిత్రం ‘మహానటి’ని అద్భుతంగా తెరకెక్కించి అందరి మన్ననలు పొందారు. ప్రభాస్ చిత్రాన్ని కూడా ఆయన అదే స్థాయిలో గొప్పగా తెరకెక్కిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు.