కొడుకు సినిమా కోసం ఇల్లు అమ్మేశా… పూరి

Puri Jagannadh Sold A House

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

పూరి జగన్నాధ్‌ తన కొడుకు హీరోగా స్వీయ దర్శకత్వంలో ‘మెహబూబా’ చిత్రాన్ని నిర్మించాడు. తన కొడుకును మొదటి సినిమాతోనే స్టార్‌ను చేయాలనే ఉద్దేశ్యంతో కాస్త ఎక్కువ బడ్జెట్‌ను పెట్టడం జరిగింది. ఇతర నిర్మాతలు కొత్త హీరోపై ఎక్కువ బడ్జెట్‌ పెట్టేందుకు ఆసక్తి చూపించారు. అందుకే తాను స్వయంగా భారీ బడ్జెట్‌తో ఆకాష్‌తో సినిమాను చేశాను అని, సినిమా నిర్మాణం కోసం అందరు అనుకుంటున్నట్లుగా నిజంగానే తన ఇల్లు అమ్ముకున్నాను అని, అయితే సినిమా విడుదలైన తర్వాత తప్పకుండా తాను పడ్డ కష్టంకు ప్రతిఫలం దక్కుతుందనే నమ్మకం ఉందని పూరి చెప్పుకొచ్చాడు. 

ఆకాష్‌ పూరి హీరోగా తెరకెక్కిన ‘మెహబూబా’ చిత్రం ఈవారంలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్‌ మరియు పోస్టర్‌లు సినిమా స్థాయిని పెంచాయి. ఈ చిత్రంను తాను అనుభవం ఉన్న ఒక దర్శకుడిగా కాకుండా కొత్త దర్శకుడిగా తెరకెక్కించాను అంటూ పూరి సినిమాపై అంచనాలు పెంచుతున్నాడు. సినిమా కోసం ఇల్లు అమ్ముకున్నాను అనే బాధ లేదని, సినిమా బాగా వచ్చిందని, తప్పకుండా తాను అనుకున్న కలెక్షన్స్‌ వస్తాయనే నమ్మకంను పూరి వ్యక్తం చేశాడు. సినిమా విడుదలై సక్సెస్‌ అయితే అటువంటి ఇల్లులు రెండు తీసుకుంటాను అంటూ పూరి సన్నిహితుల వద్ద చెబుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రాన్ని నైజాం ఏరియాకు  గానే దిల్‌రాజు తీసుకోవడంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. మరి పూరి నమ్మకంను ఈ చిత్రం నిలిపేనా, పూరికి ఆర్థికంగా మద్దతుగా సక్సెస్‌ దక్కేనా అనేది చూడాలి.