ఒళ్లో కూర్చోబెట్టుకోని ముద్దులు పెడుతూన్న శ్రుతి హాసన్. ఎవరినంటే ?

శ్రుతి హాసన్ ప్రస్తుతం తెలుగులో ఏ సినిమాను కూడా చేయడం లేదని తెలుస్తోంది. బాలయ్యతో చేసిన వీర సింహా రెడ్డి, చిరుతో చేసిన వాల్తేరు వీరయ్యతో శ్రుతి హాసన్ బాగానే హల్చల్ చేసింది. ఈ రెండు సినిమాలు హిట్ అయ్యాయి. వీర సింహా రెడ్డి సినిమాలోని శ్రుతి హాసన్ పాత్ర కంటే వాల్తేరు వీరయ్యలో కాస్త బెటర్ అనిపించింది. అలా శ్రుతి హాసన్ ఈ సంక్రాంతికి థియేటర్లో సందడి చేసింది.

తాజాగా శ్రుతి హాసన్ ఓ పోస్ట్ వేసింది. మొత్తానికి తాను రియలైజ్ అయినట్టుగా తెలిపింది. ఎప్పుడూ ఈ బిజీ జీవితమే కాదన్నట్టుగా చెప్పుకొచ్చింది. ఇంతకీ శ్రుతి హాసన్ ఏం చెప్పిందంటే.. ప్రతీ రోజూ యుద్దం చేయడం కాదు.. ఇంట్లో సరదగా కూర్చుని స్నాక్స్ తింటూ.. మన పెట్‌లను ప్రేమగా చూసుకోవాలి.. క్లారాతో ఆటలు ఆడుతూ ముద్దులు పెడుతూ నా ఒళ్లో కూర్చోబెట్టుకోవడం కూడా ఇంపార్టెంట్ అని నేను రియలైజ్ అయ్యాను అంటూ చెప్పుకొచ్చింది.

ఇక శ్రుతి హాసన్ ఆదివారం నిద్రలేపింది కూడా ఆ క్లారానే అంట. తన మీదకు వచ్చి నిద్ర లేపిందని చెబుతూ దాన్ని ప్రేమగా నిమురుతున్న వీడియోను కూడా శ్రుతి హాసన్ ఇన్ స్టా స్టోరీలో పెట్టింది. ప్రస్తుతం శ్రుతి హాసన్ తన బాయ్ ఫ్రెండ్ శంతనుతో కలిసి ఉంటున్న సంగతి తెలిసిందే. గత కొన్నేళ్లుగా ఈ ఇద్దరూ ముంబైలో ఒకే చోట ఉంటున్నారు. కరోనా సమయంలోనూ ఇద్దరూ కలిసి ఉన్నారు. అక్షర హాసన్ కూడా అప్పుడప్పుడు వీరిద్దరితోనే ఆ ఫ్లాట్‌లో కనిపిస్తుంటుంది.పెళ్లి చేసుకునే ఉద్దేశం ఇప్పట్లో లేదన్నట్టుగా కౌంటర్లు వేసింది.