Sports: తొలి ఇన్నింగ్స్ లో భారీ స్కోర్ దిశగా భారత్..!

Sports: India towards a huge score in the first innings..!
Sports: India towards a huge score in the first innings..!

భారత్-ఇంగ్లండ్ మధ్య హైదరాబాద్ ఉప్పల్ గ్రౌండ్ లో తొలి టెస్ట్ జరుగుతున్న విషయం తెలిసిందే. తొలుత టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు 246 పరుగులకు ఆలౌట్ అయింది. భారత్ భారీ స్కోర్ చేస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 421 పరుగులు సాధించింది. 7 వికెట్లను కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో రవీంద్ర జడేజా, అక్సర్ పటేల్ ఉన్నారు. రవీంద్ర జడేజా(81), అక్షర్ పటేల్ (35) పరుగులు చేశారు.

ఇంగ్లండ్ బౌలర్లు స్కోర్ ను కట్టడి చేసే ప్రయత్నం చేసినప్పటికీ భారత బ్యాటర్లు స్కోర్ బోర్డుని పరుగులు పెట్టిస్తునే ఉన్నారు. జడేజా, అక్షర్ పటేల్ మధ్య భాగస్వామ్యంతో నిలకడగా పరుగులు సాధించారు. రవీచంద్రన్ అశ్విన్ రన్ ఔట్ కావడంతో భారత్ బాటర్ల మధ్య సమన్వయ లోపం వల్ల తప్పిదం జరిగిందని తెలుస్తోంది. 110 ఓవర్లలో భారత జట్టు 421/7 పరుగులు సాధించింది. టీమిండియా 175 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది.