శ్రీరెడ్డి ఇంత పని చేస్తుందనుకోలేదు

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

గత కొన్ని వారాలుగా టాలీవుడ్‌లో సంచలనాలకు తెర లేపుతున్న శ్రీరెడ్డి తాజాగా మరో పెద్ద బాంబ్‌ పేల్చింది. ఒక ప్రముఖ నిర్మాత కొడుకు తనను వాడుకున్నాడు అంటూ మొదట సోషల్‌ మీడియాలో చెప్పుకొచ్చిన శ్రీరెడ్డి నిన్న రాత్రి మీడియా సంస్థలకు అతడిపై క్లారిటీ ఇస్తూ ఫొటోలను కూడా ఇచ్చేసింది. మొదట టీవీ9లో ఈ ఫొటోలను ప్రసారం చేయాని ఆమె కోరింది. కాని టీవీ 9 వారు బ్లర్‌ చేసి ఆ ఫొటోలను వేయడంతో మరో టీవీ ఛానెల్‌కు వెళ్లి శ్రీరెడ్డి ఫొటోలను లీక్‌ చేసింది. శ్రీరెడ్డి గత కొంత కాలంగా చేస్తున్న ఆరోపణలు ఇప్పుడు పతాక స్థాయికి చేరుకున్నాయనని చెప్పుకోవచ్చు.

ప్రముఖ నిర్మాత సురేష్‌బాబు తనయుడు అభిరామ్‌పై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేయడంతో పాటు అతడితో ఉన్న ఫొటోలను శ్రీరెడ్డి విడుదల చేయడం ప్రస్తుతం టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా ఉంది. టాలీవుడ్‌లోనే పేరు మోసిన నిర్మాతగా పేరు తెచ్చుకున్న సురేష్‌బాబు కుటుంబంకు సంబంధించిన వ్యక్తి ఇలాంటి విషయంలో ఇరుక్కోవడం సంచలనంగా మారింది.

శ్రీరెడ్డి ఆరోపణలు చేసే వరకు వెళ్తుందని ఊహించాం కాని ఇలా ఫొటోలను కూడా విడుదల చేస్తుందని ఊహించలేదు అంటూ సినీ పరిశ్రమకు చెందిన ఒక వ్యక్తి చెప్పుకొచ్చాడు. శ్రీరెడ్డి ముందు ముందు ఇంకా పలువురి బండారంను బయట పెడతాను అంటూ హెచ్చరించింది. సినిమా పరిశ్రమలో ఆడవారికి భద్రత లేదని, ఆడవారు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని శ్రీరెడ్డి చెప్పుకొచ్చింది. సురేష్‌బాబు తనయుడి విషయంలో మా వర్గాల వారు మరియు సినీ వర్గాల వారు ఎలా స్పందిస్తారా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు