తెలంగాణ ప్రభుత్వంలో ఇసుక తుపాను

TDP MLA revanth reddy fires on ktr

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

టీడీపీ ఫైర్ బ్రాండ్ నేత రేవంత్ రెడ్డి మరోసారి కేసీఆర్ ను టార్గెట్ చేశారు. తెలంగాణలో నిజామాబాద్, వరంగల్, నల్గొండ, మహబూబ్ నగర్ లో శాండి మాఫియా రెచ్చిపోతోందన్నారు. ఓవర్ లోడ్ లు తీసుకెళ్లడమే కాకుండా.. అడ్డమొచ్చినవారిని తొక్కించేయడానికి కూడా మాఫియా వెనుకాడటం లేదన్నది రేవంత్ మాట. ఈ వ్యవహారంలో మంత్రుల బంధువులున్నారని సంచలన ఆరోపణలు చేశారు.

ఇటీవల జరిగిన నేరెళ్ల ఘటనలో… అసలు కారణం ఇసుక మాఫియాననే తేలింది. కాబట్టి కేసీఆర్, కేటీఆర్ మౌనముద్ర దాల్చారని రేవంత్ విరుచుకుపడుతున్నారు. ప్రతి చిన్న విషయానికి స్పందించే కేటీఆర్ నోరెందుకు తెరవడం లేదని రేవంత్ అడుగుతున్నారు. నేరెళ్ల బాధితులు ఎన్టీఆర్ భవన్ కు వచ్చి తమ కష్టాలు రేవంత్ కు చెప్పుకున్నారు.

ఇసుక మాఫియా గులాబీ నేతలకు అయాచిత వరంలా మారిందని, దీన్ని అడ్డం పెట్టుకుని రోజుకు కోటి రూపాయలు సంపాదిస్తున్నారని విరుచుకుపడ్డారు రేవంత్ రెడ్డి. అందుకే ప్రభుత్వానికి ఎంత నష్టం వస్తున్నా పట్టించుకోకుండా.. మాఫియా ఇచ్చే మామూళ్ల మత్తులో జోగుతున్నారంటున్నారు. స్వయంగా నేతలే అండగా ఉండటంతో.. ఇక అధికారులు కూడా ఏం చేయలేకపోతున్నారనేది రేవంత్ భావన.

మరిన్ని వార్తలు: