హీరోల మీటింగ్‌ మళ్లీ ఉందా?

Tollywood Heros Meeting may be keeping again in Annapurna Studios

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
పవన్‌ కళ్యాణ్‌పై శ్రీరెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యల వెనుక తాను ఉన్నట్లుగా స్వయంగా రామ్‌ గోపాల్‌ వర్మ ఒప్పుకున్న నేపథ్యంలో రచ్చ జరిగిన విషయం తెల్సిందే. పవన్‌ కళ్యాణ్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌కు వెళ్లి తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై, చేయించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే అంటూ నిరసన తెలియజేసిన విషయం తెల్సిందే. దాంతో సినిమా పరిశ్రమ అంతా కూడా కదిలింది. మొదట 24 విభాగాలకు చెందిన వారు మీటింగ్‌ ఏర్పాటు చేసి ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీలో సినిమా పరిశ్రమ వారి గురించి అనుచితంగా మాట్లాడితే వెంటనే చర్యలు తీసుకోవాని నిర్ణయించారు. ఆ తర్వాత చిరంజీవి ఆహ్వానం మేరకు సినిమా హీరోలు అంతా కూడా భేటీ అయ్యారు.

చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా దాదాపు 30 మంది హీరోలు అన్నపూర్ణ స్టూడియోలో భేటీ అవ్వడం జరిగింది. ఈ భేటీలో దాదాపు మూడు గంటల పాటు పలు విషయాలపై హీరోలు మాట్లాడినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా న్యూస్‌ ఛానెల్స్‌ వ్యవహరిస్తున్న తీరును వ్యతిరేకిస్తూ మెగా హీరోలు ఈ భేటీలో మాట్లాడినట్లుగా తెలుస్తోంది. స్టార్‌ హీరోలతో పాటు చిన్న హీరోలు కూడా తమ అభిప్రాయాలను వెళ్లడి చేశారు. అయితే ఆ భేటీలో ఏం జరిగింది? ఏం నిర్ణయించుకున్నారు? అనే విషయమై ఎలాంటి క్లారిటీ రాలేదు. అయితే మరోసారి హీరోల భేటీ ఉంటుందని మాత్రం అంతా భావించారు. సినీ వర్గాల నుండి కూడా అదే విషయం సమాచారం అందింది. కాని హీరోల రెండవ భేటీ లేదని తెలుస్తోంది. మొదటి భేటీలో మూడు గంటల పాటు చర్చించినా కూడా ఏమాత్రం ఉపయోగం లేకుండా పోయింది. అందుకే రెండవ భేటీకి పలువురు హీరోలు ఆసక్తి చూపడం లేదట.